ఒకప్పుడు ఇళ్ల ముందు పశువులు, గేదెలు, ఊరు ఆనుకొని గొర్రెలు, మేకల మందలు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాటికి మేతతో పాటు తాగడానికి నీళ్లు కూడా లేవు. దిక్కుతోచని పరిస్థితుల్లో సంతలకు తోలుకెళ్లి తక్కువ ధరకే అమ్మేస్తున్నారు. నీటి తొట్టెల పథకం నీరుగారిపోయింది. ఆడిట్ చేస్తే అందులో జరిగిన అవినీతి బయటపడుతుంది.
– జైనుల్లా, రైతువిభాగం జిల్లా నాయకులు, వైఎస్సార్సీపీ, కదిరి
చర్యలు తీసుకుంటాం
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు జిల్లా వ్యాప్తంగా నీటి తొట్టెలు నిర్మించాం. ఇంకా కొన్ని నిర్మించాల్సి ఉంది. స్థానికంగా కొన్ని అవాంతరాలు ఎదురు కావడంతో జాప్యం జరుగుతోంది. ఇప్పటికే నిర్మించిన తొట్టెల్లో నీరు ఉండేలా చూడాల్సిన బాధ్యత ఆయా పంచాయతీలదే. ఎక్కడైనా నీరు నింపలేదంటే తగిన చర్యలు తీసుకుంటాం.
– విజయ ప్రసాద్, డ్వామా పీడీ


