
ఒక్క డయేరియా మరణమూ సంభవించకూడదు
ప్రశాంతి నిలయం: జిల్లాలో ఒక్క డయేరియా మరణం కూడా సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఽఅధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన తన చాంబర్లో డయేరియా క్యాంపెయిన్ పోస్టర్లను, కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలై 31వ తేదీ వరకూ స్టాప్ డయేరియా క్యాంపెయిన్ నిర్వహించాలన్నారు. అందులో భాగంగా ఆశ కార్యకర్తలు, మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఎంఎల్హెచ్పీలు ఇంటింటి సర్వే చేయాలన్నారు. ఐదేళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలను గుర్తించి వారి తల్లులకు డయేరియా గురించి అవగాహన కల్పించాలన్నారు. పారిశుధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు కడుగు విధానం, శుభ్రమైన తాగునీరు గురించి తెలియజేస్తూ ఓఆర్ఎస్, జింక్ అందజేయాలన్నారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఫైరోజా బేగం, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ నాగేంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఏజెంట్ల జాబితా అందజేయండి
ప్రశాంతి నిలయం: రాజకీయ పార్టీల ప్రతినిధులు వెంటనే బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకుని జాబితాను తమకు అందజేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏజెంట్ల నియామకంలో నిబంధనలన్నీ కచ్చితంగా పాటించాలన్నారు. బూత్ ఏజెంట్లకు సంబంధిత బూత్లో తప్పక ఓటు ఉండి తీరాన్నారు. రాజకీయ పార్టీల తరఫున ఇంకా ఏవైనా సూచనలు, సలహాలు ఉంటే తమ దృష్టికి తీసుకునిరావాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో డీఆర్ఓ విజయ సారథితోపాటు పలు రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.
5న జాతీయ లోక్ అదాలత్
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని కోర్టు బెంచుల్లో జూలై 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ. భీమారావు ఆదేశాల మేరకు మంగళవారం న్యాయసేవా సదన్లో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.రాజశేఖర్ అధ్యక్షతన మున్సిపల్, ఆర్టీసీ అధికారులు, బీఎస్ఎన్ఎల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ కె.శ్రీనివాస రావు మాట్లాడుతూ ఉచిత ప్రజా ప్రయోజన న్యాయ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. జాతీయ లోక్ అదాలత్లో ఎంవీఓపీ కేసులు, కొళాయి పన్ను, ఇంటి పన్ను కేసులు, బీఎస్ఎన్ఎల్ కేసులు అధిక సంఖ్యలో కేసులు రాజీ చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
యూజీ, పీజీ ఫలితాల విడుదల
అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల యూజీ, యూజీ ఆనర్స్, పీజీ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. గత ఏప్రిల్, మే మాసాల్లో మెగా సప్లిమెంటరీ, డిగ్రీ 6వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, ఆనర్స్, 7వ సెమిస్టర్, ిపీజీ 3వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాలను మంగళవారం ఎస్కేయూ పరీక్షల విభాగం డైరెక్టర్ ఆచార్య జీవీ రమణ, కళాశాల ప్రిన్సిపల్ పద్మశ్రీ, పరీక్షల విభాగపతి తిరుమలేష్ విడుదల చేశారు. 2016–19 మెగా సప్లిమెంటరీ పరీక్షలలో 94 శాతం, 6వ సెమిస్టర్ పరీక్షల్లో 99.6 శాతం, పీజీ 3వ సెమిస్టర్ లో 90 శాతం, ఆనర్స్ 7వ సెమిస్టర్లో 99 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పరీక్షల ఫలితాలను కళాశాల వెబ్సైట్లో చూసుకోవచ్చని కళాశాల పరీక్షల విభాగాధిపతి తిరుమలేష్ తెలిపారు. కార్యక్రమంలో ఉప పరీక్షా విభాగాధిపతులు అక్షుతానంద, చంద్ర శేఖర్, జీఎల్ఎన్ ప్రసాద్, పల్లవి, ఫిరోజ్ ఖాన్, అహ్మద్, నరసింహులు, సోమశేఖర్, కేశాలు, సూగప్ప, రమేష్ పాల్గొన్నారు.

ఒక్క డయేరియా మరణమూ సంభవించకూడదు

ఒక్క డయేరియా మరణమూ సంభవించకూడదు