
విద్యుదాఘాతంతో రైతు మృతి
కనగానపల్లి: మండలంలోని సీఎన్ కోట గ్రామానికి చెందిన రైతు ఎర్రప్ప (58) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. ఆయనకు భార్య లక్ష్మీదేవి, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పాడి పోషణతో కుటుంబాన్ని పోషించుకున్న ఎర్రప్ప.. ఆదివారం ఉదయం సమీపంలోని పొలాల్లోకి తన పాడి ఆవులను మేపునకు తోలుకెళ్లాడు. కిందకు వేలాడుతున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి బోరు మోటారుకు లాగిన విద్యుత్ సర్వీసు వైర్ తగిలి ఓ ఆవు ఎగిరిపడుతుండడం గమనించిన ఎర్రప్ప వెంటనే ఆ వైర్ను పక్కకు లాగాడు. ఆవు సురక్షితంగా బయటపడింది. అయితే అప్పటికే విద్యుత్ షాక్కు గురై ఎర్రప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలియగానే గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంటి పెద్ద మృతదేహాన్ని చూడాగానే కుటుంబ సభ్యుల రోదనకు అంతులేకుండా పోయింది.