
జిల్లా బాలబాలికల ఫుట్బాల్ జట్ల ఎంపిక
హిందూపురం టౌన్: స్థానిక ఎంజీఎం క్రీడా మైదానంలో జిల్లా బాలబాలికల ఫుట్బాల్ జట్ల ప్రాబబుల్స్ను ఆదివారం ఎంపిక చేశారు. జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొనగా, ప్రతిభ ఆధారంగా జట్లలో చోటు కల్పించారు. మొత్తం 45 మందితో కూడిన ప్రాబబుల్స్ను ఎంపిక చేసినట్లు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జేవీ అనిల్కుమార్ తెలిపారు. శిక్షణ అనంతరం వీరిలో ప్రతిభ చాటిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో అసోయేషన్ జిల్లా కార్యదర్శి సలీం, ట్రెజరర్ శేఖర్, ఈసీ మెంబర్ విజయవాణి, పీడీలు లోక్నాథ్, ఆజాద్, ఫుట్బాల్ కోచ్లు విజయభాస్కర్, చైతన్య, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.