
● అ‘పూర్వ’ కలయిక
తనకల్లు: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1997–98 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదువుకున్న వారు అదే పాఠశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. నాటి చిలిపి పనులు గుర్తు చేసుకుని మురిసిపోయారు. తరగతి గదులలో కలియ తిరుగుతూ గతాన్ని నెమరు వేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన నాటి గురువులు వేమనారాయణ, శంకర్, రమణారెడ్డి, కరీముల్లాను ఘనంగా సన్మానించి, ఆశ్వీరాదం తీసుకున్నారు. కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు న్యాయవాది వెంకట్రామిరెడ్డి, రషీద్, ఇందాదుల్లా, రాజా, ఖాదర్వలి, గోపాల్, సుగుణ, గంగాధర్, పురుషోత్తం, తదితరులు నేతృత్వం వహించారు.