'వేలంలో అతడికి రూ. 25 కోట్లు పైనే.. స్టార్క్ రికార్డు బద్దలవ్వాల్సిందే' | Irfan backs this India star to break Mitchell Starc's record | Sakshi
Sakshi News home page

IPL 2025 Mega Auction:'వేలంలో అతడికి రూ. 25 కోట్లు పైనే.. స్టార్క్ రికార్డు బద్దలవ్వాల్సిందే'

Nov 19 2024 9:42 AM | Updated on Nov 19 2024 9:56 AM

Irfan backs this India star to break Mitchell Starc's record

ఐపీఎల్‌-2025 సీజ‌న్ మెగా వేలం నవంబ‌ర్ 24, 25 తేదీల్లో సౌథీ అరేబియాలోని జెడ్డా న‌గ‌రంలో జ‌ర‌గ‌నుంది. ఇందుకు అన్నిరకాల ఏర్పాట్లు బీసీసీఐ చేస్తోంది. ఈ మెగా వేలంలో మొత్తం 574 మంది క్రికెట‌ర్లు త‌మ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత్‌​ నుంచి రిషబ్ పంత్‌, కేఎల్ రాహుల్‌, శ్రేయస్ అయ్యర్‌, భువనేశ్వర్ కుమార్‌, మహ్మద్ షమీ వంటి స్టార్ ​క్రికెటర్లు సైతం ఉన్నారు.

దీంతో ఫ్యాన్స్ కూడా ఈ వేలం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ  క్యాష్ రిచ్ మెగా వేలానికి ముందు రిషబ్ పంత్‌పై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలుస్తాడ‌ని పఠాన్ జోస్యం చెప్పాడు. 

కాగా గ‌తేడాది జ‌రిగిన ఐపీఎల్‌-2024 మినీ వేలంలో స్టార్క్‌ను  రూ.24.75 కోట్లకు భారీ ధ‌ర‌కు కేకేఆర్ కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ హిస్ట‌రీలో అత్య‌ధిక అమ్ముడుపోయిన ఆట‌గాడిగా స్టార్క్ నిలిచాడు. కానీ ఇప్పుడు అత‌డి రికార్డు డేంజ‌ర్‌లో ఉంద‌ని, పంత్ క‌చ్చితంగా బ్రేక్ చేస్తాడ‌ని ప‌ఠాన్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.

విడిచిపెట్టిన ఢిల్లీ..
ఇక‌ ఈ మెగా వేలానికి ముందు పంత్‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ రిటైన్ చేసుకోలేదు. దీంతో పంత్ వేలంలో త‌న పేరును రూ.2 కోట్ల క‌నీస ధ‌ర‌గా న‌మోదు చేసుకున్నాడు. పంత్ త‌న రీ ఎంట్రీలో అద‌ర‌గొడుతుండ‌డంతో వేలంలో అత‌డిపై కాసుల వ‌ర్షం కురిసే అవ‌కాశ‌ముంది.

అత‌డి కోసం పంజాబ్ కింగ్స్‌, కేకేఆర్ పోటీ ప‌డే ఛాన్స్ ఉన్న‌ట్లు ఐపీఎల్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 2016లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన రిష‌బ్‌.. ఎనిమిది సీజ‌న్ల పాటు ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు. ఇప్పుడు తొలిసారి అతడిని వేలంలోకి ఢిల్లీ ఫ్రాంచైజీ విడిచిపెట్టింది. దీంతో అందరి కళ్లు పంత్‌పైనే ఉన్నాయి.
చదవండి: న్యూజిలాండ్‌ స్టార్‌ క్రికెటర్‌పై నిషేధం..
 

Advertisement
 
Advertisement
Advertisement