IPL 2025: మారని సీఎస్‌కే తీరు.. వరుసగా నాలుగో ఓటమి | IPL 2025: Punjab Kings beats Chennai Super Kings by 18 runs | Sakshi
Sakshi News home page

IPL 2025: మారని సీఎస్‌కే తీరు.. వరుసగా నాలుగో ఓటమి

Apr 8 2025 11:23 PM | Updated on Apr 9 2025 7:43 AM

IPL 2025: Punjab Kings beats Chennai Super Kings by 18 runs

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఓట‌ముల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ముల్లాన్‌పూర్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 18 ప‌రుగుల తేడాతో సీఎస్‌కే ప‌రాజ‌యం పాలైంది. 220 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 201 ప‌రుగులు చేసింది. 

సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో డెవాన్ కాన్వే(49 బంతుల్లో 69) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. శివ‌మ్ దూబే(27 బంతుల్లో 42), ర‌చిన్ ర‌వీంద్ర‌(36), ధోని(27) ప‌ర్వాలేద‌న్పించారు. ఈ మ్యాచ్‌లో కూడా సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌(1) నిరాశ‌ప‌రిచాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో లాకీ ఫెర్గూస‌న్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. మాక్స్‌వెల్,య‌ష్ ఠాకూర్‌ ఓ వికెట్ సాధించాడు. డెవాన్ కాన్వే రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. సీఎస్‌కేకు ఇది వ‌రుస‌గా నాలుగో ఓట‌మి కావ‌డం గ‌మ‌నార్హం.

ఆర్య విధ్వంసం.. 
అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో  6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.  పంజాబ్ బ్యాటర్లలో ప్రియాన్ష్ ఆర్య(7 ఫోర్లు, 9 సిక్స్‌ల‌తో 103) విధ్వంస‌క‌ర‌ సెంచరీతో చెల‌రేగాడు. ప్రియాన్ష్ కేవ‌లం 39 బంతుల్లోనే తొలి ఐపీఎల్ శ‌త‌కాన్ని అందుకున్నాడు.

అత‌డితో పాటు శశాంక్ సింగ్‌(52), జాన్సెన్‌(34) పరుగులతో రాణించారు. సీఎస్‌కే బౌలర్లలో ఖాలీల్ అహ్మద్, అశ్విన్ తలా రెండు వికెట్లు సాధించగా.. నూర్‌, ముఖేష్ చెరో వికెట్ సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement