
ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి సెంచరీతో చెలరేగాడు. 181 బంతుల్లో 10 ఫోర్లు సాయంతో కోహ్లి తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. కాగా కోహ్లికి ఇది 29వ టెస్టు సెంచరీ. ఓవరాల్గా 76 అంతర్జాతీయ సెంచరీ కావడం గమానార్హం. ది కూడా ఇంటర్నేషనల్ కెరీర్లో 500వ మ్యాచ్లో ఈ శతకం బాదడం మరింత విశేషం.
అ అదే విధంగా 55 నెలల తర్వాత విదేశీ గడ్డపై కోహ్లి సెంచరీ నమోదు చేశాడు. కోహ్లి ప్రస్తుతం 109 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడితో పాటు రవీంద్ర జడేజా 50 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 92 ఓవర్లు ముగిసే టీమిండియా 4 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. అంతకుముందు డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్టులో కూడా కోహ్లి(76) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
Ending a 5-year wait in his 500th Int'l Game with a 💯
— FanCode (@FanCode) July 21, 2023
Just @imVkohli things!
.#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/5j5td33iO2