Kohli Winning Celebration: వినిపించడం లేదు.. ఇంకా గట్టిగా

ENG Vs IND: Kohli Winning Celebrations Viral After Team India Victory - Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా విజయానికి దగ్గరవుతున్న సమయంలో విరాట్‌ కోహ్లి చేసిన రచ్చ మరోసారి వైరల్‌గా మారింది. మాములుగానే కోహ్లిని తట్టుకోవడం కష్టం. ఇక టీమిండియా విజయం సాధిస్తుందంటే ఆ హంగామా వేరుగా ఉంటుంది. లార్డ్స్‌ టెస్టులో భారత్‌ విజయం అనంతరం కోహ్లి చేసిన రచ్చ మరువకముందే.. మరోసారి దానిని మించిన ఎంజాయ్‌ను అందించాడు. ఓవల్‌ టెస్టులో ఇంగ్లండ్‌ వికెట్‌ పడిన ప్రతీసారి కోహ్లి కొత్త జోష్‌తో కనిపించాడు.

చదవండి: Jasprit Bumrah: బుమ్రా తొలి వికెట్‌.. వందో వికెట్‌ ఒకేలా.. 

ఈలలు, గోలలతో​ తనదైన హావభావాలు పలికిస్తూ చిన్నపిల్లాడిలా మారిపోయాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌ ప్రధాన బ్యాట్స్‌మన్‌ అవుటైన తర్వాత టీమిండియా అభిమానులు అరుపులతో స్టేడియం దద్దరిల్లేలా.. ''వినిపించడం లేదు.. ఇంకా గట్టిగా'' అంటూ కోహ్లి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ప్రస్తుతం కోహ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఈ విజయం ఊహించలేదని.. మా కుర్రాళ్లు అద్భుతం చేశారు. అని మ్యాచ్‌ విజయం అనంతరం చెప్పుకొచ్చాడు. 

ఇక నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 157 పరుగులతో ఘన విజయాన్ని అందుకుంది. 368 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ టీమిండియా పేస్‌, స్పిన్‌ దాటికి 210 పరుగులకు చాప చుట్టేసింది. చివరిసారి 1971లో ఓవల్‌ మైదానంలో ఇంగ్లండ్‌పై టెస్టులో గెలిచిన భారత్‌ ఆ తర్వాత ఈ మైదానంలో ఎనిమిది టెస్టులు ఆడి ఐదింటిని ‘డ్రా’ చేసుకొని, మూడింటిలో ఓడింది. ఎట్టకేలకు 50 ఏళ్ల తర్వాత ఈ మైదానంలో భారత్‌ మళ్లీ విజయం రుచి చూసింది. ఇక తాజా విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈనెల 10 నుంచి మాంచెస్టర్‌లో చివరిదైన ఐదో టెస్టు జరుగుతుంది.

చదవండి: Virat Kohli Winning Words: ఇలాంటి విజయం ఊహించలేదు.. మా కుర్రాళ్లు అద్భుతం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top