12 ఏళ్ల భారత్‌కు ఫిఫా ప్రపంచకప్‌ | Coca Cola Brings The Iconic FIFA World Cup Trophy To India After 12 Years, Unveiled In New Delhi | Sakshi
Sakshi News home page

12 ఏళ్ల భారత్‌కు ఫిఫా ప్రపంచకప్‌.. కోకా-కోలా భాగస్వామ్యంతో..!

Jan 12 2026 10:16 AM | Updated on Jan 12 2026 10:51 AM

Coca Cola Brings the Iconic FIFA World Cup Trophy to India After 12 Years

ఫిఫా ప్రపంచకప్‌ ట్రోఫీ 12 ఏళ్ల తర్వాత భారత్‌లోకి అడుగుపెట్టింది. కోకా-కోలా భాగస్వామ్యంతో జరుగుతున్న ట్రోఫీ టూర్ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను భారత అభిమానులకు దగ్గర చేసింది. ప్రతిష్టాత్మకమైన ఈ ట్రోఫీని న్యూఢిల్లీలోని తాజ్ మహల్ హోటల్‌లో ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమానికి కేంద్ర యువజన, క్రీడా శాఖ మంత్రి డా. మాన్సుఖ్ మాండవియా, బ్రెజిల్ మాజీ వరల్డ్ కప్ విజేత గిల్బర్టో డి’సిల్వా, క్రీడా చరిత్రకారుడు బోరియా మజుందార్, అలాగే కోకా-కోలా ఇండియా నాయకత్వం హాజరయ్యారు.

మంత్రి మాండవియా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో క్రీడలు జాతీయ ప్రాధాన్యతగా మారాయి. 2047 నాటికి భారత్‌ను ప్రపంచంలోని టాప్ 5 క్రీడా దేశాల్లో ఒకటిగా నిలపడం మా లక్ష్యం అని అన్నారు.  

కోకా-కోలా ఇండియా అధ్యక్షుడు సంకేత్ రే మాట్లాడుతూ.. భారత క్రీడలు విస్తృత భాగస్వామ్యం, బలమైన మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ అనుసంధానం ద్వారా కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయి. FIFAతో మా దీర్ఘకాలిక భాగస్వామ్యం వల్ల ఇలాంటి చారిత్రాత్మక క్షణాలను భారత అభిమానులకు చేరువ చేస్తున్నామని అన్నారు.  

ట్రోఫీ విశేషాలు  
ఫిఫా ప్రపంచకప్‌ ట్రోఫీ 18 క్యారెట్ల బంగారంతో తయారు చేయబడింది. దీని బరువు 6.175 కిలోలు. ఈ ట్రోఫీ రెండు మానవ ఆకృతులు ప్రపంచ గోళాన్ని పైకి ఎత్తిన రూపకల్పనతో 1974లో రూపొందించబడింది. ఈ ట్రోఫీ టూర్‌ 30 దేశాల్లో, 75 స్టాప్‌లతో 150 రోజుల పాటు సాగుతుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement