Women T20 World Cup 2023, IND-W Vs PAK-W: Smriti Mandhana Ruled Out With Finger Injury Against Pakistan Clash - Sakshi
Sakshi News home page

T20 WC: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌.. టీమిండియాకు ఊహించని షాక్‌!

Feb 11 2023 8:37 AM | Updated on Feb 11 2023 10:02 AM

Big blow for India before Pakistan clash,Mandhana RULED OUT - Sakshi

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగే తమ తొలి మ్యాచ్‌లో భారత జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన బరిలోకి దిగడం సందేహంగా మారింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ప్రాక్టీస్‌ వ్యచ్‌ సందర్భంగా స్మృతి చేతి వేలికి గాయమైంది.

ఈ గాయం నుంచి ఆమె కోలుకోకపోవడంతో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో స్మృతి ఆడలేదు. మరోవైపు భుజం నొప్పితో బాధపడుతున్న కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కూడా తొలి మ్యాచ్‌లో ఆడేది లేనిది ఆదివారం తెలుస్తుంది.
చదవండి: దిగ్గజ ఆల్‌రౌండర్‌ రికార్డు బద్దలు కొట్టిన జడేజా

Advertisement
 
Advertisement
Advertisement