సాగుకు జలగండం! | - | Sakshi
Sakshi News home page

సాగుకు జలగండం!

Jun 16 2025 7:17 AM | Updated on Jun 16 2025 7:17 AM

సాగుక

సాగుకు జలగండం!

30 అడుగుల లోతులో జలం

హుస్నాబాద్‌రూరల్‌: జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటిపోతున్నాయి. పంటలకు నీటి వినియోగం తగ్గినా వ్యవసాయ బావుల్లో రైతులు ఉహించని విధంగా 30 అడుగుల కింద నీరు చేరడంతో రైతులు వరి నార్లు పోసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. భూగర్భ జలశాఖ వారు ఏర్పాటు చేసిన బోరుబావుల్లో ప్రతి నెలా భూగర్భ జలాలను లెక్కిస్తుంటారు. కోహెడ మండలం రాంచంద్రాపూర్‌, హుస్నాబాద్‌ మండలం ఉమ్మాపూర్‌, జనగామ జిల్లా నర్మెట్టలో ఏర్పాటు చేసిన బోరు బావుల్లో నీటి మట్టాన్ని గురువారం భూగర్భ జలశాఖ అధికారులు లెక్కించారు. గత నెలలో 28 అడుగుల లోతున ఉన్న జలం ఇప్పుడు 30 అడుగుల కిందకు పడిపోయిందని తెలిపారు. రెండేళ్ల కిందట జిల్లాలో భూగర్భ జలాలు 2 మీటర్ల లోతులోనే ఉన్నాయని ఇప్పుడు అడుగంటిపోతున్నట్లు చెబుతున్నారు.

కాలేశ్వరం నీరు రాకపోవడం వల్లే..

కాలేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రాకపోవడంతో చెరువు, కుంటలు ఎండిపోవడం, వాగుల్లో ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నారని భూగర్భ జలాల శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. కోహెడ మండలం రామచంద్రాపూర్‌ వాగు ఒడ్డు ఉన్నప్పటికి రెండేళ్ల కింద 2 మీటర్ల లోతు ఉన్న జలం ఇప్పుడు 10 మీటర్ల కిందకు చేరింది. హుస్నాబాద్‌ మండలం ఉమ్మాపూర్‌ మహాసముద్రం కిందనే ఏర్పాటు చేసిన బోరు బావిలో కూడా భూగర్భ జలాలు 30 అడుగులకు చేరాయి.

రెండేళ్ల కిందట 2 మీటర్ల కిందనే..

నెలలోనే 2 ఫీట్లకు పడిపోయిన జలాలు

వరుణుడి కోసం రైతుల ఎదురుచూపు

ఆరుద్రలో వానలు కురవకపోతే

ఆరుతడి పంటలే

ప్రతీ నెల నీటిని లెక్కిస్తాం

రాష్ట్ర భూగర్భ జలశాఖ, స్వాన్‌ ఎన్విరోల్‌మెంటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారు భూగర్భ జలాలను లెక్కిస్తున్నారు. మే నెలలో 28 అడుగుల లోతులో ఉన్న నీరు ఇప్పుడు 30 అడుగులకు పడిపోయింది. వ్యవసాయ పంటలకు నీటి వినియోగం తగ్గినా వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. 30 కిలోమీటర్లకు చొప్పున ఏర్పాటు చేసిన బోరు బావిలో నీటిని లెక్కించి అధికారులకు పంపిస్తున్నాం.

– ఎండీ నసీర్‌, స్వాన్‌ ప్రతినిధి

సాగుకు వెనుకంజ

యాసంగి వరి పంటలు కోసిన తర్వాత భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయ బావుల్లో నీరు పైకి వస్తుంది. జూన్‌ నెలలో కూడా రైతులు ఎలాంటి పంటలు సాగు చేయకముందే భూగర్భ జలాలు అడుగున చేరడంతో వానాకాలంలో రైతులు నార్లు పోసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. పునాస పంటలు కూడా వేయలేక రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. రోహిణి, మృగశిర కార్తెల్లో ఆశించిన మేర వానలు పడకపోవడంతో ఆరుద్ర కార్తైపె ఆశలు పెంచుకున్నారు. వానలు లేకపోతే వేసిన పంటలు ఎండిపోతాయనే భయంతో విత్తనాలు వేయలేకపోతున్నారు.

సాగుకు జలగండం!1
1/1

సాగుకు జలగండం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement