రైతు నేస్తంపై నేడు సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ | - | Sakshi
Sakshi News home page

రైతు నేస్తంపై నేడు సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

Jun 16 2025 7:17 AM | Updated on Jun 16 2025 7:17 AM

రైతు

రైతు నేస్తంపై నేడు సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

కొండపాక(గజ్వేల్‌): దుద్దెడ, కొండపాక, మర్పడ్గ, మేదినీపూర్‌ల్లోని రైతు వేదికల్లో సోమవారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి చే రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్‌ కార్యక్రమం జరుగుతుందని మండల వ్యవసాయాధికారి శివరామకృష్ణ తెలిపారు. వ్యవసాయ సాగులో ఆధునిక పద్ధతులు, మెలకువలు పాటిస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు పొందుతూ రైతులు ఆర్థికంగా లాభపడేలా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

శ్రీశ్రీ బాటలో

యువ కవులు నడవాలి

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): ప్రకృతిలో ప్రతి వస్తువుపై రచన చేస్తూ తెలుగు సాహిత్యంలో ఎనలేని కీర్తి గడించిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు బాటలో యువ కవులు సాగాలని బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం, యువకవి బస్వ రాజకుమార్‌లు అన్నారు. శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా ఆదివారం సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాజానికి స్ఫూర్తినిచ్చే రచనలు, రచయితలను మరువకూడదన్నారు. ముఖ్యంగా శ్రీశ్రీ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడ్డారని, వారి బాటలో సాగాలన్నారు.

పర్యావరణ పరిరక్షణ

అందరి బాధ్యత

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, చెట్లు లేకపోతే మనుగడ లేదని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షాబుద్దీన్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో షాబుద్దీన్‌ మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆలోచన లేకుండా ఎక్కడపడితే అక్కడ కోనోకార్పస్‌ చెట్లను పెంచి, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడిందని ఆరోపించారు. అలాగే ఎప్పడు పడితే అప్పుడు చెట్లు నరికివేతతో విద్యుత్‌ సరఫరాను సైతం నిలిపివేసిందని ఆయన ఆరోపించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చెట్ల నరికివేత పని చేపట్టిందన్నారు. గత ప్రభుత్వం ఆలోచన లేకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. కరెంటు తీగల కింద కోనోకార్పస్‌ చెట్లను పెంచడం వల్లే ఇప్పుడు ఈ దుస్థితి దాపురించిందన్నారు.

సంక్షేమ పథకాలు

ప్రజల్లోకి తీసుకెళ్లాలి

వర్గల్‌(గజ్వేల్‌): కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనివాస్‌బాబు అన్నారు. ఆదివారం డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు వర్గల్‌ మండలం గౌరారం వద్ద ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌గౌడ్‌ నేతృత్వంలో తిరుగులేని శక్తిగా కాంగ్రెస్‌ ఆవిర్భవిస్తోందన్నారు. గత పాలకుల తప్పిదాలు చక్కదిద్దుతూ, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అన్ని వర్గాల మెప్పు పొందుతున్నట్లు పేర్కొన్నారు. పార్టీకి కార్యకర్తలే బలమని, వారిని కాపాడుకునే బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు.

రైతు నేస్తంపై నేడు సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ 
1
1/2

రైతు నేస్తంపై నేడు సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

రైతు నేస్తంపై నేడు సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ 
2
2/2

రైతు నేస్తంపై నేడు సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement