
సరికొత్త హంగులతో పోలీస్స్టేషన్
జిన్నారం(పటాన్చెరు): సీఎస్ఆర్ నిధులతో అత్యాధునిక వసతులతో మోడల్ పోలీస్స్టేషన్ నిర్మించడం అభినందనీయమని మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ అన్నారు. ఆదివారం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో నూతన పోలీస్స్టేషన్ భవన నిర్మాణానికి ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, హెటిరో పరిశ్రమ ప్లాంట్ డైరెక్టర్ మోహన్రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే అత్యాధునిక పోలీస్స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హెటిరో పరిశ్రమ సహకారంతో రూ. 3.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నట్లు చెప్పారు.
బోనాలతో మహిళలు
అమ్మవార్లకు బోనాలు..
హుస్నాబాద్: శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, భక్తుల కోలాహలం మధ్య బోనాల పండుగ వైభవంగా జరిగింది. పట్టణంలో ఆదివారం ఎల్లమ్మ, పోచమ్మ బోనాల పండుగ నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
ఐజీ సత్యనారాయణ

సరికొత్త హంగులతో పోలీస్స్టేషన్

సరికొత్త హంగులతో పోలీస్స్టేషన్