
సిద్దిపేట సూపర్
రామ్ దూర్గ్ పాలకవర్గ ప్రశంస
సిద్దిపేటజోన్: సిద్దిపేట చాలా బాగుందని, స్వచ్ఛబడి కొత్తగా ఉందని కర్నాటక రాష్ట్ర రామ్దుర్గ్ మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు కితాబిచ్చారు. శనివారం వారు సిద్దిపేట బల్దియాను సందర్శించారు. స్వచ్ఛబడిలో డిజిటల్ క్లాస్ ప్రక్రియ పరిశీలించారు. స్టీల్బ్యాంక్ సందర్శించారు. అదేవిధంగా వార్డు స్థాయి కంపోస్టు యార్డులో తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువుల తయారీ గూర్చి ఆరా తీశారు. బుస్సా పూర్ డంప్యార్డ్ సందర్శించారు. తడి చెత్త ద్వారా బయోగ్యాస్ తయారీ విధానం గురించి తెలుసుకున్నారు. ఇదే తరహాలో రామ్దూర్గ్ మున్సిపాలిటీలో అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తామని పేర్కొన్నారు. సిద్దిపేటను సందర్శించిన వారిలో రామ్దూర్గ్ మున్సిపాలిటీ చైర్మన్ సిద్దిరప్ప సురేష్, వైస్ చైర్మన్లు లక్ష్మి, జగదీష్, సరితా గోవింద్తో పాటు 22 మంది కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. వీరికి సిద్దిపేట బల్దియా గురించి కమిషనర్ ఆశ్రిత్ కుమార్ వివరించారు.