బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌

Jun 15 2025 9:17 AM | Updated on Jun 15 2025 9:17 AM

బాధ్య

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌

సిద్దిపేటరూరల్‌: జిల్లాకు నూతన కలెక్టర్‌గా బదిలీపై వచ్చిన కే.హైమావతి శనివారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌కు చేరుకున్న ఆమెకు అదనపు కలెక్టర్లు గరిమాఅగర్వాల్‌, అబ్దుల్‌ హమీద్‌లు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశమై పలు అంశాలపై సమీక్షించారు. బదిలీపై వెళ్తున్న కలెక్టర్‌ మిక్కిలినేని మను చౌదరి మర్యాదపూర్వకంగా నూతన కలెక్టర్‌ హైమావతిని కలిశారు.

భవిష్యత్‌ కమ్యూనిస్టులదే

సీపీఎం నేత చుక్కా రాములు

సిద్దిపేటఅర్బన్‌: రాబోయే కాలంలో దేశంలో కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయం అవుతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు అన్నారు. శనివారం సిద్దిపేటలోని కార్మిక, కర్షక భవన్‌లో సీపీఎం జిల్లా స్థాయి శిక్షణ తరగతులు ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అసమానతలకు, దోపిడీకి వ్యతిరేకంగా సామ్రాజ్యవాదుల విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. దేశంలోనూ కార్మిక వర్గం జూలై 9న సార్వత్రిక సమ్మెను చేయాలని సన్నద్ధమవుతున్నారని తెలిపారు. అంతర్జాతీయ, జాతీయ రాజకీయాలు అనే అంశంపై జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు శశిధర్‌ బోధించారు. మతం, మతోన్మాదం, ప్రతిఘటన అంశాలపై రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్‌ బోధించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, నాయకులు గోపాలస్వామి, భాస్కర్‌, ఎల్లయ్య, సత్తిరెడ్డి, వెంకట్‌, కృష్ణారెడ్డి, యాదగిరి, రవికుమార్‌, బాలనర్సయ్య, శ్రీనివాస్‌, ప్రశాంత్‌, శిరీష, నవీన, శారద, తదితరులు పాల్గొన్నారు.

బీసీ డిక్లరేషన్‌ను

అమలు చేయాలి

ముదిరాజ్‌ మహాసభ ఉపాధ్యక్షుడు యాదగిరి

గజ్వేల్‌రూరల్‌: కాంగ్రెస్‌ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి డిమాండ్‌ చేశారు. శనివారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకులు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నాయని, జనాభాలో 60శాతానికి పైగా ఉన్న బీసీల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో బీసీలకు 37శాతం రిజర్వేషన్‌ కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించిందని గుర్తు చేశారు. 17న యునైటెడ్‌ పూలే ఫ్రంట్‌, తెలంగాణ జాగృతి నేతృత్వంలో మెదక్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్‌ పూలే ఫ్రంట్‌ నాయకులు విజయేంద్రసాగర్‌, సదానంద్‌, కుమారస్వామి, నర్సింహ, వంశరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌ 1
1/2

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌ 2
2/2

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement