
అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్రామ్
● ఎమ్మార్పీఎస్ నేతమందకృష్ణ ● దుద్దెడలో జగ్జీవన్రామ్ విగ్రహావిష్కరణ
కొండపాక(గజ్వేల్): అణగారిన వర్గాల అభ్యన్నతి కోసం పాటుపడిన ఆశాజ్యోతి బాబు జగ్జీవన్రామ్ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. మండలంలోని దుద్దెడలో అంబేడ్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్రామ్ విగ్రహాన్ని శనివారం రాత్రి ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ దేశానికి సుదీర్ఘ కాలం సేవలందించిన అగ్రగణ్యుల్లో జగ్జీవన్రామ్ మొదటి స్థానంలో నిలిచారన్నారు. భారతదేశంలో చదువు అనే అక్షర జ్ఞానాన్ని పరిచయం చేసిన వ్యక్తి అని, బడుగు బలహీన వర్గాల ప్రజలు నేటికీ రిజర్వేషన్ల ఫలాలు పొందటం జగ్జీవన్రామ్ చలవేనన్నారు. 1994లో చేపట్టిన ఎమ్మార్పీఎస్ ఉద్యమం వల్ల ఉపకులాల ఏర్పాటుకు చట్టబద్ధత లభించిందని, దుద్దెడలో పూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆరెపల్లి మహాదేవ్, నాయకులు భాకి ప్రభాకర్, దరువు ఎల్లన్న, అంజన్న, శ్రీనివాస్, ప్రభాకర్, కొమ్ము మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.