సంక్షేమ హాస్టళ్లను పట్టించుకోండి | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ హాస్టళ్లను పట్టించుకోండి

Mar 18 2025 9:07 AM | Updated on Mar 18 2025 9:03 AM

దుబ్బాక: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు అధ్వానంగా మారాయని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సోమ వారం అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే దృష్టిసారించాలన్నారు. హాస్టళ్ల నిర్వహ ణ కొరవడటం.. నాణ్యమైన భోజనం అందడటంలేదన్నారు. కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా అర్థం చేసుకోవాలన్నారు. హబ్షీపూర్‌ గురుకులంలో 7 వ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి నీలోఫర్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారన్నారు. విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినా విషయం బయటకు రానివ్వడంలేదన్నారు. ఏ హాస్టల్‌కు వెళ్లినా ఫుడ్‌పాయిజన్‌, సిబ్బంది సక్రమంగా ఉండక సౌకర్యాలు సరిగ్గా లేక అవస్థలు పడుతున్నారన్నారు.

విద్యార్థులు ఆత్మహత్యలకు

పాల్పడుతున్నా పట్టించుకోవడంలేదు..

అసెంబ్లీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement