హుస్నాబాద్: ఏకలవ్య ఐఐటీ బుక్స్ అకాడమి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఐఐటీ పరీక్షల్లో హుస్నాబాద్కు చెందిన విద్యార్థులు మంచి ప్రతిభ సాధించారు. హైదరాబాద్లోని దోమలగూడ రామకృష్ణ మఠంలో ఆదివారం ఏకలవ్య ఐఐటీ అకాడమి స్కూల్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ, ఆకెళ్ల రాఘవేంద్ర అవార్డులను ప్రదానం చేశారు. 6వ తరగతి చదువుతున్న ఆరాధ్యకు ప్రథమ శ్రేణి అవార్డు, ద్వితీయ శ్రేణి అవార్డు ఎల్.వైష్ణవి, రామ్ చరణ్, సాయి హవీస్ అందుకున్నారు. ప్రిన్సిపాల్ రాజేందర్, ఉపాధ్యాయులు విద్యార్ధులను అభినందించారు.


