
గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్టు
కొమురవెల్లి(సిద్దిపేట): గంజాయి అమ్ముతున్న వ్యక్తిని టాస్క్ఫోర్స్, పోలీసులు కలిసి అరెస్టు చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో చేర్యాల సీఐ ఎల్. శ్రీను ఎస్ఐ రాజుతో కలిసి వివరాలు వెల్లడించారు. మండల శివారులోని దాచారం గుట్ట సమీపంలో ఓ వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్, పోలీసులు కలిసి దాడి చేశారు. ఈ దాడిలో కుంభ భూమరాజును అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 195 గ్రాముల గంజాయి, మొబైల్ ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
పారిశ్రామిక వాడలో..
తూప్రాన్, మనోహరాబాద్(తూప్రాన్): పారిశ్రామిక ప్రాంతంలో బీహార్కు చెందిన వ్యక్తి నుంచి 1.350 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ సీఐ గోపాల్ వివరాలు వెల్లడించారు. మనోహరాబాద్ మండలం పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి విక్రయాలపై నిఘా ఏర్పాటు చేశారు. అనుమానాస్పద వ్యక్తులను విచారించినట్లు తెలిపారు. తమ విచారణలో ఓ స్టోరేజీ పరిశ్రమలో బీహార్కు చెందిన ముఖేశ్ కుమార్ మండల్(29) ఆయా పరిశ్రమల్లో కార్మికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల యువకులకు గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని ఎండు గంజాయి, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని నర్సాపూర్ ఎకై ్సజ్ అధికారులకు అప్పగించారు. ఈ దాడుల్లో ఎస్ఐ బాలయ్య, హెడ్కానిస్టేబుల్ చంద్రయ్య, కానిస్టేబుళ్లు రాజు, నరేశ్, రవి, హరీశ్లు పాల్గొన్నారు.

గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్టు