
చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ
సంగారెడ్డి ఎడ్యుకేషన్: చరిత్రను బీజేపీ, ఆర్ఎస్సెస్ వక్రీకరిస్తున్నాయని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మండిపడ్డారు. బీజేపీ నేతలకు, ఆర్ఎస్సెస్కు సాయుధ పోరాటానికి సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు? సంగారెడ్డిలో వీర తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవం సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఐబీ నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో రాఘవులు మాట్లాడారు. నిజాం, బీజేపీ విధానాలు ఒక్కటేనని, మతం పేరిట ప్రజలను చీల్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నాడు బ్రిటిష్ వాళ్లకుతొత్తుగా పని చేసింది ఆర్ఎస్సెస్ వాళ్లేనని, సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని తేల్చి చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ విమోచనదినంగా నిర్వహించడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్కా రాములు, రాష్ట్ర నాయకుడు మల్లిఖార్జున్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మల్లేశం, రాజయ్య, మాణిక్యం, సాయిలు పాల్గొన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటానికిఆర్ఎస్సెస్, బీజేపీలకు సంబంధమేంటి?
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడుబీవీ రాఘవులు