
మిరుదొడ్డిలో నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే
మిరుదొడ్డి(దుబ్బాక): ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీనగర్, నిమ్హాన్స్ బెంగళూరు ఆధ్వర్యంలో బుధవారం మిరుదొడ్డిలో నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే–2 నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య స్థితి, జీవన శైలి సమస్యలు, ఆరోగ్య అవగాహన స్థాయిని అంచనా వేయడం, చికిత్స అంతరాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఇన్వెస్టిగేటర్స్ డాక్టర్ వామన్ కులకర్ణి, డిపార్టుమెంట్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్ డాక్టర్ సాయి కృష్ణా తిక్కా, తెలంగాణ స్టేట్ కో ఆర్డినేటర్ బి.ప్రవళిక, రారష్ట్ర ఆరోగ్య బృందం సభ్యులు గ్రేస్, వేణు మాధురి, రంజీత్, యాదవ్, శ్రీధర్, వెంకట్రావు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా పీహెచ్సీ డాక్టర్ సమీనా సుల్తానా, సీహెచ్ఓ లింగమూర్తి సర్వేను సమీక్షించారు.
కళా ఉత్సవ్ పోటీలకు
విద్యార్థులు ఎంపిక
సిద్దిపేటరూరల్: పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళా ఉత్సవ్ పోటీల్లో రాఘవాపూర్ కేజీబీవీ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు కేజీబీవీ ప్రత్యేక అధికారి జె .హేమలత ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యాశా ఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో కస్తూ ర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు గ్రూప్ డ్యాన్స్ విభాగంలో జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచారు. కాగా రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎంపికయ్యారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన కరీనా , రాధిక, సుహాని, లిఖితను జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, జీఈసీఓ నర్మద, మండల విద్యాధికారి రాజిరెడ్డి అభినందించారు.
జానపద పోటీల్లో
రాణించిన విద్యార్థి
సిద్దిపేట ఎడ్యుకేషన్: వరంగల్లో జరిగిన ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) విద్యార్థి సింధు పురుషోత్తం జానపద గేయపోటీల్లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. కళాశాల సాంస్కృతిక విభాగం కన్వీనర్ డాక్టర్ మట్టా సంపత్కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం కళాశాలలో విద్యార్థిని ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్య రెడ్డి, కృష్ణయ్య, ఉమామహేశ్వరి, వెంకటరమణ విద్యార్థిని అభినందించారు.
విద్యార్థులకు
గుణాత్మకమైన బోధన
కొండపాక(గజ్వేల్): ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మకమైన బోధనలు అందేలా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ సంచాలకుడు రమేశ్ తెలిపారు. బుధవారం మండలంలోని సిర్సనగండ్లలోని ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాలలోని 3,4,5 తరగతుల విద్యార్థులను సబ్జెక్టులలో పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్రెడ్డి, ఎంఈఓ శ్రీనివాస్రెడ్డి, హెచ్ఎం జయప్రకాశ్రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.