
7,52,259 మంది ఓటర్లు
● స్థానిక సంస్థల తుది జాబితా విడుదల
● తొలగించిన ఓట్లు 42,394
సాక్షి, రంగారెడ్డిజిల్లా: స్థానిక సంస్థల తుది ఓటర్ల జాబితా మంగళవారం విడుదలైంది. ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటన, అభ్యంతరాల స్వీకరణ, మార్పులు, చేర్పుల తర్వాత తుది జాబితాను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 526 గ్రామ పంచాయతీలు ఉండగా, వీటి పరిధిలో మొత్తం 7,52,259 మంది ఓటర్లు ఉన్నారు. వీరి లో 3,76,823 మంది పురుషులు, 3,75,408 మంది మహిళలు, 28 మంది ఇతరులు ఉన్నారు. 4,668 వార్డులు, 4,682 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేశారు. 42,394 మృతులు, బోగస్ ఓట్లను తొలగించారు. ఇదిలా ఉంటే ఈ నెల 6న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా ముసాయిదాను ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రకటించి, అభ్యంతరాల స్వీకరణ, సవరణల తర్వాత 10న తుది జాబితా వెల్లడించే అవకాశం ఉంది.