
ఇళ్ల నిర్మాణంలో నిబంధనలు తప్పనిసరి
గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి వీపీ గౌతమ్
తుక్కుగూడ: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్మాణాలు చేపట్టాలని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి వీపీ గౌతమ్ సూచించారు. శుక్రవారం ఆయన మున్సిపల్ పరిధిలోని రావిర్యాలలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను అడిగి మున్సిపల్ పరిధిలో ఎంతమంది లబ్ధిదారులు పనులు ప్రారంభించారు అని తెలుసుకున్నారు. ప్రభుత్వం మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసిందన్నారు. లబ్ధిదారులు 450 నుంచి 650 అడుగుల వరకు నిర్మించుకోవాలని సూచించారు. హౌసింగ్ డీఈ బిక్కునాయక్, ఏఈ వెంకటేశ్వర్రావు, మున్సిపల్ కమిషనర్ ఎ.వాణి, పాల్గొన్నారు.