ఇద్దరు బైక్‌ దొంగల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు బైక్‌ దొంగల అరెస్ట్‌

Jun 15 2025 9:15 AM | Updated on Jun 15 2025 9:15 AM

ఇద్దరు బైక్‌ దొంగల అరెస్ట్‌

ఇద్దరు బైక్‌ దొంగల అరెస్ట్‌

శంకర్‌పల్లి: ద్విచక్ర వాహనాలు చోరీ చేసి డూప్లికేట్‌ ఆర్‌సీలతో బైక్‌లు విక్రయిస్తున్న ఇద్దరు దొంగల ఆటకట్టించారు శంకర్‌పల్లి పోలీసులు. వారి వద్ద నుంచి 11 బైక్‌లను రికవరీ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను శంకర్‌పల్లి ఠాణాలో నార్సింగి ఏసీపీ రమణగౌడ్‌, శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్‌గౌడ్‌ విలేకరులకు వెల్లడించారు. శంకర్‌పల్లితోపాటు పరిసర ప్రాంతాల్లో బైక్‌ దొంగతనాలకు ప్పాడుతూ తప్పించుకు తిరుగుతన్న దొంగలపై పోలీసులు స్పెషల్‌ టీంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి 10గంటల సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు శంకర్‌పల్లి డబుల్‌ బెడ్రూం ఇళ్లలో నివాసం ఉండే బొగ్గు శ్రీనివాస్‌కు చెందిన మూడు బైక్‌లను తనిఖీ చేశారు. బైక్‌ నంబర్లు, చాయిస్‌ నంబర్లు తేడా ఉండటంతో పోలీసులు ప్రశ్నించగా అసలు విషయం బయటపడిందన్నారు. శ్రీనివాస్‌ నాలుగు నెలలుగా మెహదీపట్నం, అత్తాపూర్‌, గుడిమల్కాపూర్‌, నార్సింగి, శంకర్‌పల్లి తదతర ప్రాంతాల్లో మొత్తం 11 బైక్‌లను చోరీ చేసినట్లు తెలిపారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీల బాగోతం బట్టబయలైందన్నారు. చోరీ చేసిన బైక్‌లను పోలిఉండే కంపెనీ, కలర్‌, మాడల్‌ ఇతర బైకుల నెంబర్‌ ప్లేటు, చాయిస్‌ నంబర్లు ఫోటోలు తీసి ఆర్టీఏ వ్యాలెట్‌ ద్వారా డూప్లికెట్‌ ఆర్‌సీనీ తయారు చేసి నకిలీ ఆర్‌సీతో తన స్నేహితుడు నాగరాజు ద్వారా బైక్‌లను అమ్మించి డబ్బులు తీసుకునేవాడనని తెలిపారు. ఈ మేరకు శ్రీనివాస్‌ను, నాగరాజును రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. కేసును ఛేదించిన శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్‌గౌడ్‌ను, దొంగలను పట్టుకునేందుకు పనిచేసిన టీంను ప్రత్యేకంగా అభినందించారు.

11 ద్విచక్ర వాహనాల రికవరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement