డిప్యూటీ సీఎంకు శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎంకు శుభాకాంక్షలు

Jun 16 2025 7:17 AM | Updated on Jun 16 2025 7:17 AM

డిప్య

డిప్యూటీ సీఎంకు శుభాకాంక్షలు

చేవెళ్ల: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన జన్మదినం సందర్భంగా నగరంలోని ప్రజాభవన్‌లో ఆదివారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

కేంద్రం వెంటనే

కులగణన చేపట్టాలి

హయత్‌నగర్‌: స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు గడిచినా ఏ వర్గం వారి జనాభా ఎంత ఉందో లెక్కలు లేకపోవడం దురదృష్టకరమని సీపీఐ రాష్ట్ర వర్గ సభ్యుడు ఆందోజు రవీంద్రాచారి, కౌన్సిల్‌ సభ్యుడు ముత్యాల మాదిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం జరిగిన పార్టీ కుంట్లూరు శాఖ మహాసభలో వారు మాట్లాడారు. కేంద్రం తక్షణం స్పందించి కులగణన చేపట్టాలని డిమాండ్‌ చేశారు. పేద ప్రజలకు కార్పొరేట్‌ విద్య, వైద్యం ఉచితంగా అందజేయాలన్నారు. పార్టీ మండల సహాయ కార్యదర్శి ఆజ్మీరా హరిసింగ్‌ నాయక్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మండల కార్యవర్గ సభ్యుడు చిర్ర శేఖర్‌, నాయకులు గణేశ్‌, పేరాల గోపి, సైదులు, అనసూయ, రాజు, రవళి తదితరులు పాల్గొన్నారు.

పేదల ఇళ్ల స్థలాల కోసం పోరాడుతూనే ఉంటాం

మొయినాబాద్‌రూరల్‌: పేదల ఇళ్ల స్థలాల కోసం పోరాటాలు చేస్తూనే ఉంటామని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. మండల పరిధిలోని సజ్జన్‌పల్లిలో ఆదివారం పార్టీ మండల మహాసభను మండల కార్యదర్శి కె.శ్రీనివాస్‌ అధ్యక్షతన నిర్వ హించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జంగయ్య జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల కోసం భూ పోరాటాలకు సిద్ధం కావాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఆపరేషన్‌ కగార్‌తో మావోయిస్టులను అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని పంపడం బాధాకరమన్నారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు కనుగంటి పర్వాతాలు, కె.రామస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభులింగం, ఏఐటీయూసీ కార్యదర్శి సత్యనారాయణ, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

పేదల భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకునేది లేదు

మొయినాబాద్‌: ఏళ్లుగా పేద, బడుగు బలహీన వర్గాల రైతులు సాగుచేసుకుంటున్న భూములను గోశాలకు ఇస్తామంటూ ప్రభుత్వం లాక్కోవడం అన్యాయమని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం అన్నారు. మున్సిపల్‌ పరిధి ఎనికేపల్లి సర్వేనంబర్‌ 180లోని వంద ఎకరాల భూములను ఆదివారం ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల భూములను అన్యాయంగా గుంజుకుంటే చూస్తూ ఊరుకోమని, పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పాలన చేతకాక భూములు అమ్మడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. పేదల భూములు లాక్కొని పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాష్‌, మాజీ సర్పంచ్‌ రాజు, ఇతర నాయకులు ఉన్నారు.

డిప్యూటీ సీఎంకు  శుభాకాంక్షలు 1
1/3

డిప్యూటీ సీఎంకు శుభాకాంక్షలు

డిప్యూటీ సీఎంకు  శుభాకాంక్షలు 2
2/3

డిప్యూటీ సీఎంకు శుభాకాంక్షలు

డిప్యూటీ సీఎంకు  శుభాకాంక్షలు 3
3/3

డిప్యూటీ సీఎంకు శుభాకాంక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement