వైవిధ్య తటాకం! | - | Sakshi
Sakshi News home page

వైవిధ్య తటాకం!

Jun 16 2025 7:17 AM | Updated on Jun 16 2025 7:17 AM

వైవిధ్య తటాకం!

వైవిధ్య తటాకం!

ప్రత్యేకతలివీ..

● క్యాంపస్‌లోని 2.68 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఏర్పాటు

● 450 మీటర్ల వ్యాసంతో దీనికి రూపకల్పన

● 80 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం ఉండేలా..

● మురుగు నీరు చేరకుండా కేవలం వర్షం నీటితోనే నిల్వ

● నగరంలోని మిగతా చెరువుల కన్నా విభిన్నంగా తీర్చిదిద్దడం

● చెరువు పరిసరాల్లో జీవ వైవిధ్యం ఉట్టిపడేలా..

● ప్రకృతి సహజసిద్ధంగా ఉండేలా.. వేలాది నాటి భారీ బండరాళ్లను కాపాడటం

● పక్షుల ఆవాసాలు, చెరువు చుట్టూ పచ్చదనం పెంచడం

● పూల మొక్కలను కూడా పెంచేందుకు నిర్ణయం

● క్యాంపస్‌లోని వారు ఆహ్లాద వాతావరణంలో సేద తీరేలా చర్యలు

● చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌ల ఏర్పాటు యోచన

● అందమైన లైటింగ్‌, చెరువులో నీటి ఫౌంటెన్‌లతో కొత్త శోభ

రాయదుర్గం: నగరానికి, చెరువులకు పురాతన చరిత్రతో పాటు అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ ఉన్న చెరువులను కాపాడటం, కలుిషితం కాకుండా చూడటం గగనంగా మారింది. ఇలాంటి తరుణంలో నగరంలో మొదటిసారిగా ఓ చెరువునే ఏర్పాటు చేసి భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో నూతనంగా చెరువు తవ్వకానికి శ్రీకారం చుట్టడం విశేషం. ‘మనూ’ క్యాంపస్‌లో పదిహేను రోజుల క్రితం చెరువు తవ్వకం పనులకు వైస్‌ చాన్స్‌లర్‌, పద్మశ్రీ ప్రొఫెసర్‌ సయ్యద్‌ ఐనుల్‌ హసన్‌ శంకుస్థాపన చేశారు. క్యాంపస్‌లో భూగర్భ జలాలను గణనీయంగా పెంపొందించి బోర్‌వెల్‌లకు కీలకమైన వనరుగా ఉపయోగపడేలా దీన్ని రూపొందించారు. ‘మనూ’ క్యాంపస్‌లోని వృక్షాలకు అవసరమైన నీరు అందుబాటులో ఉండేలా, పచ్చదనం మరింత పెంపొందేలా, పక్షులు, ఇతర జీవజాతుల మనుగడ సాఫీగా సాగేలా ఈ చెరువుకు శ్రీకారం చుట్టారు. క్యాంపస్‌లో తయారు చేసే ఈ చెరువుకు ‘జీవవైవిధ్య చెరువు’ (బయోడైవర్సిటీ పాండ్‌)గా పేరు కూడా పెట్టడం గమనార్హం.

మనూలో ‘బయోడైవర్సిటీ పాండ్‌’కు శ్రీకారం

నగరంలోనే సరికొత్త విధానంలో తొలి చెరువు

క్యాంపస్‌లో భూగర్భ జలాల పెంపునకు చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement