పేదలను ఇబ్బంది పెట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

పేదలను ఇబ్బంది పెట్టొద్దు

Jun 16 2025 7:17 AM | Updated on Jun 16 2025 7:17 AM

పేదలను ఇబ్బంది పెట్టొద్దు

పేదలను ఇబ్బంది పెట్టొద్దు

హుడాకాంప్లెక్స్‌: రాజకీయాల కోసం పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి హితవు పలికారు. సరూర్‌నగర్‌, ఆర్‌కేపురం డివిజన్లకు చెందిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులు తమ సమస్యలను ఆదివారం ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గంలోని పేదలకు దాదాపు 5వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఆన్‌లైన్‌ లక్కీడీప్‌ ద్వారా కేటాయించడం జరిగిందన్నారు. ఆర్‌కేపురం, సరూర్‌నగర్‌ డివిజన్లకు చెందిన 1,800 మందికి డ్రా ద్వారా కేటాయించామన్నారు. స్థానికులకు 10 శాతం కేటాయించి ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అర్హులకు పట్టాలు ఇచ్చామని వివరించారు. కొంతమంది కావాలని కోర్టులకు వెళ్లి లబ్ధిదారులను ఇబ్బంది పెట్టే విధంగా చేస్తూ ఆనందం పొందుతున్నారని విమర్శించారు. ఉన్నతాధికారులతో చర్చించి లబ్ధిదారులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement