
అక్రమ నిర్మాణాలను ఉపేక్షించం
షాబాద్: ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని షాబాద్ తహసీల్దార్ ఎండీ అన్వర్ హెచ్చరించారు. మండల పరిధిలోని హైతాబాద్ గ్రామ శివారు సర్వే నంబర్ 8లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను శనివారం ఆయన కూల్చివేయించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రభుత్వ భూమి లో కొంతమంది వ్యాపారాలకు అనుగుణంగా కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. మండలంలో ఎక్కడైనా ప్రభు త్వ భూమిలో అక్రమ నిర్మాణాలు కనిపిస్తే వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. 111 జీవోలో కూ డా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయమై ఎంపీడీఓ, ఎంపీఓకు సమాచారం అందించామని స్పష్టంచేశారు. సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. ఆయన వెంట రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఉన్నారు.
షాబాద్ తహసీల్దార్ ఎండీ అన్వర్
హైతాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

అక్రమ నిర్మాణాలను ఉపేక్షించం