
మామిడి పండ్ల లారీ బోల్తా
కొత్తూరు: మామిడి పండ్ల లోడ్తో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ చేగూరు కూడలి జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్ జిల్లా నుంచి మామిడిపండ్ల లోడ్తో ఢిల్లీ వెళ్తున్న లారీ చేగూరు కూడలి వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్కు గాయాలయ్యాయి. ప్రమాదం కారణంగా తిమ్మాపూర్ నుంచి శంషాబాద్ వైపు వెళ్లే రోడ్డులో నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. లారీ బోల్తా పడగానే పలువురు వాహనదారులు, ప్రజలు మామిడి పండ్లను ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సాయంతో లారీను తప్పించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదంపై ఏలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ నర్సింహ్మారావు తెలిపారు.
పెంజర్ల కూడలిలో..
షాద్నగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ లారీ పెంజర్ల కూడలి సమీపంలో అదుపు తప్పి, బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ నర్సింహ్మారావు తెలిపారు.
డ్రైవర్కు గాయాలు
నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

మామిడి పండ్ల లారీ బోల్తా

మామిడి పండ్ల లారీ బోల్తా