పేదలకు ఫీజులో రాయితీ కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

పేదలకు ఫీజులో రాయితీ కల్పించాలి

Jun 15 2025 9:15 AM | Updated on Jun 15 2025 9:15 AM

పేదలకు ఫీజులో రాయితీ కల్పించాలి

పేదలకు ఫీజులో రాయితీ కల్పించాలి

తుక్కుగూడ: విద్యార్థులు ఇష్టపడి చదువుకుని ఉన్నతంగా రాణించాలని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మెదక్‌ ఎంపీ ఎం.రఘునందన్‌రావుతో కలిసి మున్సిపల్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన శ్లోక ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్‌ గుత్తా మాట్లాడుతూ.. మారుతున్న కాలానుగుణంగా విద్యాసంస్థలు విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. ఇందులో భాగంగానే ప్రతీ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలను ప్రారంభిస్తుందన్నారు. యాజమాన్యాలు సేవా దృక్పథంతో పాఠశాలలు నడిపించాలన్నారు. పేదలకు ఫీజులో రాయితీ కల్పించి కార్పొరేట్‌, ఇంటర్నేషనల్‌ పాఠశాలలో చదువుకునే అవకాశం కల్పించాలని సూచించారు. అనంతరం ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు పిల్లలపై ఒత్తిడి పెంచొద్దన్నారు. వారికి ఇష్టమైన రంగం, అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్‌ గుప్తా, మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌, నాయకులు అందెల శ్రీరాములు యాదవ్‌, దేప భాస్కర్‌రెడ్డి, ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, శ్లోక విద్యా సంస్థల చైర్మన్‌ బిట్ల శ్రీనివాస్‌రెడ్డి, ఎండీ చింతల సంగమేశ్వర్‌గుప్తా, డైరెక్టర్‌ తేలుకుంట్ల శ్రీనివాస్‌రెడ్డి, విద్యార్థులు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.

శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement