సిరిసిల్ల: నల్లా నీరు రంగుమారింది. మిషన్ భగీరథ ద్వారా మురికిగా నీరు వస్తుండడంతో తాగేందుకు కాదు కదా.. అవసరాలకూ వినియోగించుకునేందుకు జనం ఇబ్బంది పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సరఫరా అయ్యే మిషన్ భగీరథ నీరు బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద నిర్మించిన మధ్యమానేరు(శ్రీరాజరాజేశ్వర) జలాశయం ఆధారం. ప్రస్తుతం మిడ్మానేరులో నీటినిల్వలు తగ్గిపోయాయి. 26 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్లో ప్రస్తుతం 6 టీఎంసీలు మా
త్రమే ఉన్నాయి. నిండా నీరుంటే వేగంగా ఇన్టెక్ వెల్ నిండేది. కానీ నీటినిల్వలు లేక ఫ్లో తగ్గడంతో నీటిశుద్ధి పంపులకు పూర్తిస్థాయిలో నీరు రావడం లేదు. ఫలి తంగా నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నా యి. ఇటీవల వర్షాలకు కొద్దిగా కొత్త నీరు చేరడంతో నిల్వ ఉన్న నీరురంగుమారుతోందనే అనుమానాలు ఉన్నాయి.
రంగు మారుతున్న నీరు
మధ్యమానేరులో నీటినిల్వలు తగ్గి రంగుమారిన నీరు సరఫరా అవుతోంది. మధ్యమానేరు నుంచి నీటిని పంపింగ్ చేసి అగ్రహారంలోని ప్లాంటులో శుద్ధి చేసిన నీ టిని సరఫరా చేస్తున్నారు. కానీ, ఆ నీరు రంగుమారిపో యి సరఫరా అవుతుందనే ఆరోపణలు ఉన్నాయి. మిషన్ భగీరథ నీటిసరఫరా పైపుల లీకేజీ, అంతర్గతంగా నల్లా పైపుల లీకేజీలతో తాగునీరు కలుషితమవుతుందనే అనుమానాలు ఉన్నాయి. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నల్లగా వచ్చే నల్లానీటి సరఫరాను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.
నిత్యం పరీక్షలు చేస్తున్నాం
మురికిగా మిషన్ భగీరథ నీరు
అడుగంటిన మధ్యమానేరు జలాశయం
‘నల్లా’నీటితో జనం ఇబ్బందులు
ఇది సిరిసిల్ల పట్టణంలోని సంజీవయ్యనగర్లో నల్లా ద్వారా వస్తున్న మిషన్ భగీరథ నీరు. నల్లగా రంగు మారి రావడంతో ఆ నీటిని తాగేందుకు జనం జంకుతున్నారు. ఇంట్లో అవసరాలకు సైతం మిషన్ భగీరథ నీటిని వాడుకునేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా జిల్లాలో నల్లానీళ్లు మురికిగా సరఫరా అవుతున్నాయి.
మిషన్ భగీరథ స్వరూపం
మండలాలు : 12
మున్సిపాలిటీలు : 02
ఆవాస ప్రాంతాలు : 359
తాగునీరు పొందే జనాభా : 6 లక్షలు
నల్లాలు : 1,26,766
నిర్మాణ వ్యయం : రూ.1,085 కోట్లు
పైపులైన్ పొడవు : 1,263.77 కిలోమీటర్లు
నీళ్ల ట్యాంకులు : 625
పాత నీళ్లట్యాంకులు : 378
కొత్త నీళ్లట్యాంకులు : 247
రోజుకు అవసరమైన నీరు : 10 కోట్ల లీటర్లు
వినియోగించే మోటార్లు : 20
అవసరమయ్యే విద్యుత్ : 5.976 మెగావాట్స్
ఆధారం : మధ్యమానేరు
మధ్యమానేరులో నీటి నిల్వ : 6 టీఎంసీలు
మిషన్ భగీరథ నీటి సరఫరాకు ఇబ్బందులు లేవు. నిత్యం నీటిని శుద్ధిచేసి సరఫరా చేస్తున్నాం. శుద్ధి చేసిన నీటికి రోజూ పరీక్షలు చేస్తున్నాం. ఎలాంటి లోపాలు లేవు. మధ్యమానేరులో నీటి నిల్వలు తగ్గినా సరఫరాకు ఇబ్బంది లేదు. నల్లా నీరు రంగు మారి రావడానికి ఆయా ప్రాంతాల్లో పైపులైన్ లీకేజీలు కారణం కావచ్చు. ఇటీవల రంగుమారి నీరు వస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దానిపై క్లారిటీ ఇచ్చాం. నీటిని శుద్ధి చేయడంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.– అన్వర్, మిషన్ భగీరథ ఈఈ, సిరిసిల్ల
నీరు.. రంగు మారింది!
నీరు.. రంగు మారింది!
నీరు.. రంగు మారింది!