ఫూలే దంపతుల జీవితం ఆదర్శనీయం | - | Sakshi
Sakshi News home page

ఫూలే దంపతుల జీవితం ఆదర్శనీయం

Jun 15 2025 9:15 AM | Updated on Jun 15 2025 9:15 AM

ఫూలే దంపతుల జీవితం ఆదర్శనీయం

ఫూలే దంపతుల జీవితం ఆదర్శనీయం

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ● ఫూలే దంపతుల విగ్రహ ప్రతిష్ఠకు భూమిపూజ

సిరిసిల్లటౌన్‌: మహాత్మా జ్యోతిబాఫూలే దంపతుల జీవితం అన్ని తరా లకు, వర్గాలకు ఆదర్శనీయమని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. సిరిసిల్లలోని కేంద్ర గ్రంథాలయం ఆవరణలో ఫూలే దంపతుల విగ్రహ ప్రతిష్ఠకు శనివారం భూమి పూజ చేసి మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందన్నారు. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే హైదరాబాద్‌ ప్రగతిభవన్‌కు మహాత్మా జ్యోతిబాపూలే పేరు పెట్టినట్లు తెలిపారు. మహా నుభావులను స్మరించుకోవడం జాతి బాధ్యతగా భావించి సిరిసిల్లలో ఫూలే దంపతుల విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. సమాజంలో అసమానతలు తొలగించడంలో ఆ పుణ్యదంపతుల కృషి ఎనలేనిదని కొనియాడారు. సిరిసిల్ల కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌, సిరిసిల్ల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వెల్ముల స్వరూపరెడ్డి, ముదిరాజ్‌ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, సంగీతం శ్రీనివాస్‌, బొప్ప దేవయ్య, గడ్డం నర్సయ్య, ఆడెపు చంద్రకళ, కాముని వనిత, వంకాయల కార్తీక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement