వైఎస్‌ జగన్‌పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు | YS Jagan Mohan Reddy Bullet Proof Vehicle | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు

Jun 24 2025 7:55 PM | Updated on Jun 24 2025 9:32 PM

YS Jagan Mohan Reddy Bullet Proof Vehicle

తాడేపల్లి:  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు దిగింది కూటమి ప్రభుత్వం. సొంత డబ్బులతో వైఎస్‌ జగన్‌ కొనుగోలు చేసిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని పోలీసులు తీసుకెళ్లారు.  సింగయ్య మృతి కేసు విచారణ పేరుతో వైఎస్‌ జగన్‌ బుల్లెట్‌ వాహనాన్ని తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి  తరలించారు. 

వైఎస్‌ జగన్‌ భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ భద్రతను గాలికొదిలేసింది. ఈ క్రమంలోనే డొక్కు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని వైఎస్‌ జగన్‌కు కేటాయించింది. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తిచేసినా డొక్కు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం మార్చలేదు. దాంతో వైఎస్‌ జగన్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని తానే కొనుగోలు చేసుకున్నారు. 

ఇప్పటికే సింగయ్య మృతి కేసు విచారణ పేరుతో  ఏపీ 26 సీఈ 0001 నంబర్‌ గల సఫారీ వాహనాన్ని సీజ్‌ చేసిన పోలీసులు.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని తీసుకెళ్లారు. సింగయ్య మృతి కేసు విచారణ పేరుతో వైఎస్‌ జగన్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని పోలీసులు తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement