అదొక గొప్పరోజు.. నాకు అత్యంత సంతృప్తినిచ్చిన రోజు: వైఎస్‌ జగన్‌ | September 15 2023 remains one of the most satisfying days YS Jagan | Sakshi
Sakshi News home page

అదొక గొప్పరోజు.. నాకు అత్యంత సంతృప్తినిచ్చిన రోజు: వైఎస్‌ జగన్‌

Sep 15 2025 8:32 PM | Updated on Sep 15 2025 9:04 PM

September 15 2023 remains one of the most satisfying days YS Jagan

తాడేపల్లి:  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో తొలి విడత మెడికల్‌ కాలేజీలను ప్రారంభించి నేటికి రెండేళ్లు పూర్తి అయ్యింది 2023లో సరిగ్గా ఇదేరోజు (అక్టోబర్‌15న) విజయనగరంలో మెడికల్‌ కాలేజీని వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. ఆ క్రమంలోనే అక్కడ నుంచే వర్చువల్‌గా రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్‌ కాలేజీలను సైతం వైఎస్‌ జగన్‌ ఆరంభించారు.

ఆనాటి మెడికల్‌ కాలేజీ ప్రారంభోత్సవ రోజును మరోసారి గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు వైఎస్‌ జగన్‌. ‘ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య రంగంలో 15 సెప్టెంబ‌ర్, 2023 ఒక గొప్ప రోజు. ఒక ముఖ్యమంత్రిగా ప‌రిపాల‌నా కాలంలో నాకు అత్యంత సంతృప్తిని మిగిల్చిన రోజు. నేను ఒక మంచి ప‌ని చేయ‌గ‌లిగాన‌న్న తృప్తి నాకు ల‌భించింది. 1923 నుంచి 2019 వ‌ర‌కు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ రంగంలో కేవ‌లం 12 మెడిక‌ల్ కాలేజీలు ఉంటే, ఒక్క మా హ‌యాంలోనే ఒకేసారి 17 మెడిక‌ల్ కాలేజీల‌ను సంక‌ల్పించాం. 

 

ఇందులో భాగంగా 2023 సెప్టెంబ‌ర్ 15న విజ‌య‌న‌గ‌రం, రాజ‌మండ్రి, ఏలూరు, మ‌చిలీప‌ట్నం, నంద్యాల మెడిక‌ల్ కాలేజీల‌ను ఒకేసారి ప్రారంభించి ప్రజ‌ల ఆరోగ్య ప‌రిర‌క్షణ‌లో గొప్ప అడుగు ముందుకేశాం. ఈ ఐదు కాలేజీల ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తేవ‌డం నాకు సంతోషాన్ని క‌లిగించింది. వీటితో పాటు పాడేరు, పులివెందుల కాలేజీల‌ను అడ్మిష‌న్లకు కూడా సిద్ధం చేశాం. మిగిలిన ప‌నుల‌ను పూర్తి చేయాల్సిన ఈ ప్రభుత్వం ఆ 10 కాలేజీల‌ను ప్రైవేటుకు కట్టబెట్టేలా నిర్ణయం తీసుకోవడం అత్యంత దారుణం. ప్రజలంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తక్షణం ఈ ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’ అని వైఎస్‌ జగన్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement