సీఎం గైర్హాజరుతో రాష్ట్రానికి తీవ్ర నష్టం  | Telangana: MLC Jeevan Reddy Comments On CM KCR | Sakshi
Sakshi News home page

సీఎం గైర్హాజరుతో రాష్ట్రానికి తీవ్ర నష్టం 

Nov 14 2022 2:55 AM | Updated on Nov 14 2022 2:55 AM

Telangana: MLC Jeevan Reddy Comments On CM KCR - Sakshi

రాయికల్‌: అహంకారంతో సీఎం ప్రధాని పర్యటనలో పాల్గొనకపోవడం.. రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించిందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఆయన జగిత్యాల జిల్లా రాయికల్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా పార్టీలకు అతీతంగా స్వాగతం పలకడం సంప్రదాయమ ని ఆయన స్పష్టం చేశారు.

విపక్ష సీఎంలు స్టాలిన్, మమతబెనర్జీలు సైతం తమ రాష్ట్రాల్లో ప్రధాని పర్యటించినప్పుడు స్వాగ తం పలికి.. రాష్ట్రాభివృద్ధిపై నిలదీస్తారని వివరించారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గైర్హాజరై రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 9 మండలాలు ఆంధ్రలో కలిసినప్పుడు సీఎం కేసీఆర్‌ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని ఆరోపించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement