
హైదరాబాద్,సాక్షి: బలం లేని చోట బీజేపీ ఎలా గెలుస్తుంది? అంటూ హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ. కాంగ్రెస్ పోటీలో లేదు. మేము బీజేపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండదు. బలం లేని చోట బీజేపీ ఎలా గెలుస్తుంది?
బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే బీజేపీ నామినేషన్ వేసింది. 112 ఓట్లలో బీజేపీకి కేవలం 27 ఓట్లు మాత్రమే ఉన్నాయి. మాకు బలం లేకపోవడం వల్లే బరిలో నిలవలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము తటస్థంగా ఉన్నాం. ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదు.
బీజేపీ ఎలా గెలుస్తుంది క్రాస్ ఓటింగ్ ఎంకరేజ్ చేస్తున్నారా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకునికి బినామీగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టకుండా బీజేపీకి లోపాయికారి ఒప్పందంతో మద్దతు తెలిపింది’ అని వ్యాఖ్యానించారు.