అభివృద్ధికే జూబ్లీహిల్స్‌ ఓటర్ల పట్టం: మంత్రి వాకిటి శ్రీహరి | Minister Vakiti Srihari Reacts On Jubilee Hills By Election Early Trends, More Details Inside | Sakshi
Sakshi News home page

Minister Vakiti Srihari: అభివృద్ధికే జూబ్లీహిల్స్‌ ఓటర్ల పట్టం

Nov 14 2025 9:05 AM | Updated on Nov 14 2025 9:35 AM

Minister Vakiti Srihari Reacts On Jubilee Hills By Election Early Trends

హైదరాబాద్‌, సాక్షి: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌ వేళ.. ఎర్లీ ట్రెండ్స్‌పై తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి సాక్షితో స్పందించారు. జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టబోతున్నారని శుక్రవారం ఉదయం అన్నారాయన. 

‘‘జూబ్లీహిల్స్‌ ఓటర్లు మూడు పర్యాయాలు బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చారు. కానీ అభివృద్ధి కాలేదు. అధికారం కోల్పోయి.. ఇప్పుడు సిట్టింగ్ స్థానం కోల్పోతున్నామనే బీఆర్‌ఎస్‌ అడ్డగోలుగా మాట్లాడుతోంది. వాళ్లు ప్రజలను ప్రలోభాలకు గురి చేసినట్టు మేము కూడ చేస్తామనుకుంటున్నారు, వాళ్లు చేసినట్లు మద్యం, డబ్బులు పంచుతామని అనుకున్నారు. కానీ.. 

కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడిగాం. అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. ప్రజలకు చిన్నచిన్న కోరికలు ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ వాళ్ల పదేళ్ల కాలంలో ఆ కోరికలను కూడా తీర్చలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది అని అన్నారాయన.

Advertisement
 
Advertisement
Advertisement