కేజ్రీవాల్‌కు పిగ్గీ బ్యాంక్ - వీడియో వైరల్ | Girl Donates Piggy Bank to Kejriwal Video Viral | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌కు పిగ్గీ బ్యాంక్ - వీడియో వైరల్

May 13 2024 12:06 PM | Updated on May 13 2024 1:33 PM

Girl Donates Piggy Bank to Kejriwal Video Viral

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఓ చిన్న పాప తన పిగ్గీ బ్యాంకును అప్పగించింది. దీనికి సంబంధించిన వీడియో ఆప్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ.. దేశాన్ని నియంతృత్వం నుంచి విముక్తి చేసేందుకు ఓ అమ్మాయి తన మామ కేజ్రీవాల్‌కు తన పిగ్గీ బ్యాంకును ఇచ్చింది' అంటూ పోస్ట్ చేశారు.

నేను 20 రోజుల తర్వాత మళ్లీ జైలుకు వెళ్లాలి. మీరు ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తే.. నేను జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ రోడ్‌షోలో మాట్లాడుతూ , రాబోయే ఎన్నికల్లో ఆప్ విజయం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఢిల్లీ - ఎన్‌సీఆర్‌ కోసం నేను పాఠశాలలు నిర్మించడమే నా తప్పు. నేను మీ కోసం పనిచేశాను కాబట్టి వారు నన్ను జైలుకు పంపారు. ఢిల్లీ ప్రజలకు మంచి జరగటం బీజేపీకి ఇష్టం లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

నేను ప్రజలకు ఉచిత వైద్యం కోసం సౌకర్యాలు ఏర్పాటు చేసాను, కానీ నేను జైల్లో ఉన్నప్పుడు 15 రోజుల పాటు ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఆగిపోయాయని.. జైల్లో తాను అనుభవించిన పరిస్థితిని గురించి కూడా కేజ్రీవాల్ వెల్లడించారు. నేను మళ్ళీ జైలుకు వెళితే.. ఢిల్లీలో జరుగుతున్న అభివృద్ధి పనులను బీజేపీ ఆపేస్తుందని అన్నారు.

ఎవరైనా బాగా పని చేస్తుంటే, మీరు అతనిని అలా చేయనివ్వండి, నేను 500 పాఠశాలలు నిర్మించాను. మీరు దేశానికి ప్రధాని.. కాబట్టి కనీసం 5000 పాఠశాలలు నిర్మించాలని మోదీని ప్రశ్నించారు. బీజేపీ 400 సీట్లు అడుగుతోంది. తమకు 400 సీట్లు ఎందుకు కావాలని అడిగితే ఎందుకు చెప్పడం లేదని ఆప్ చీప్ అన్నారు.

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి, కేజ్రీవాల్ మోతీ నగర్‌లో ఆప్ న్యూ ఢిల్లీ లోక్‌సభ అభ్యర్థి సోమనాథ్ భారతికి మద్దతుగా రోడ్‌షో నిర్వహించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆరో దశలో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement