రేవంత్‌.. 12 రోజులు దాటినా జీతాలెక్కడ‌?: హరీష్‌రావు | BRS MLA Harish Rao Serious On CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

రేవంత్‌.. 12 రోజులు దాటినా జీతాలెక్కడ‌?: హరీష్‌రావు

Feb 12 2025 10:51 AM | Updated on Feb 12 2025 11:06 AM

BRS MLA Harish Rao Serious On CM Revanth Reddy

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌ తీరుపై మాజీ మంత్రి హరీష్‌ రావు(Harish Rao) సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చే పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు.. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజా వ్యతిరేక పాలన అంటూ ఘాటు విమర్శలు చేశారు.

తెలంగాణలో హోంగార్డుల జీతాల విషయమై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో హరీష్‌..‘రాష్ట్రవ్యాప్తంగా 16వేలకు పైగా ఉన్న హోంగార్డులకు 12 రోజులు గడస్తున్నా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు. చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు.. చేతిలో చిల్లిగవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఈఎంఐలు చెల్లించకపోవడం వల్ల బ్యాంకు అధికారులు ఫోన్లు చేసి నిలదీస్తున్న పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతి నెలా ఇదే తీరు కొనసాగుతున్నా పట్టించుకునే వారే లేరు. మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వీరికి ఏం సమాధానం చెబుతారు?. పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు.. ఇది ప్రజా పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన. హోంగార్డులకు వేతనాలు తక్షణం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement