చంద్రబాబు తప్పిదాలు రామోజీకి కనబడవా?: మంత్రి అంబటి ఫైర్‌ | Sakshi
Sakshi News home page

చంద్రబాబు తప్పిదాలు రామోజీకి కనబడవా?: మంత్రి అంబటి ఫైర్‌

Published Sun, Jun 11 2023 5:05 PM

Ambati Rambabu Serious Comments On Chandrababu And Yellow Media - Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు, ఈనాడుపై మంత్రి అంబటి రాంబాబు సీరియస్‌ అయ్యారు. నిత్యం ఈనాడు అసత్య కథనాలను వండివారుస్తోందని ఫైరయ్యారు. బాబు చేసిన తప్పిదం ఎల్లోమీడియాకు కనబడలేదా? అంటూ కామెంట్స్‌ చేశారు. 

కాగా, మంత్రి అంబటి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘పోలవరం పనుల పురోగతిపై ఈనాడు దుష్ప్రచారం చేస్తోంది. నిత్యం ఈనాడు అసత్య కథనాలను వండివారుస్తోంది. పోలవరం నిర్మాణంలో టీడీపీ ప్రభుత్వం అనే తప్పిదాలు చేసింది. చంద్రబాబు నిర్వాకం వల్ల పోలవరం నిర్మాణంలో​ తీవ్ర నష్టం జరిగింది.  డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో బాబు చేసిన తప్పదం ఎల్లో మీడియాకు కనబడలేదా?. టీడీపీ హయాంలో తప్పిదాలు రామోజీకి కనబడవా?. 

చంద్రబాబు తప్పిదాల వల్ల రూ.2020 కోట్ల నష్టం వాటిల్లింది. చంద్రబాబుకు ప్రచార యావ తప్ప మరొకటి లేదు. బాబు చేసిన తప్పిదాలను మేము సరిచేస్తున్నాం. తొలి దశ పనులకు కేంద్రం రూ.12,911 కోట్లు విడుదల చేసింది. అదనంగా రూ.5127 కోట్లు విడుదల చేయాలని కోరాం. త్వరితగతిన పోలవరం తొలిదశ పనులు పూర్తి చేస్తాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతోనే నిధుల కొరత సమస్య తీరింది. పోలవరం చూస్తామంటూ టీడీపీ పబ్లిసిటీ స్టంట్‌ చేస్తోంది. ప్రచార యావ కోసమే టీడీపీ హంగామా సృష్టిస్తోంది. పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబే. పోలవరంపై మాట్లాడేందుకు టీడీపీ నేతలకు సిగ్గుండాలి. కేవలం కడుపు మంటతోనే రామోజీ అసత్య కథనాలు రాస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఇది కూడా చదవండి: లోకేశ్‌ కోసమేనా ఇంత హైప్‌.. ఇంతటి దరిద్రమా బాబు!

Advertisement
Advertisement