
నిరంతర సేవలు ఎప్పుడు?
● అందుబాటులోకి రాని 24/7 వైద్య సేవలు ● రోజూ 80 నుంచి 90 మంది అవుట్ పేషెంట్లు ● గర్భిణులకూ ప్రత్యేక వైద్యసేవలు అందిస్తున్న వైనం ● గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సేవలు మెరుగు
సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): నాణ్యమైన, సత్వర వైద్యసేవలు అందించడంతోపాటు రోజూ 80 మంది నుంచి 90మంది వరకు అవుట్ పేషెంట్ల సేవలో నిమగ్నమైన గర్రెపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం సిబ్బంది.. నిరంతర వైద్యసేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నా.. సంబంధిత శాఖలు తగిన శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 27 గ్రామాలు ఉన్నాయి. 11 ఆరోగ్య ఉప కేంద్రాలు పనిచేస్తున్నా యి. డాక్టర్లు, వైద్యసిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు నిత్యం పేషెంట్లకు అందుబాటులో ఉంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రాస్తులను గుర్తించడంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. క్రమం తప్పకుండా వారి ఆరోగ్య పరిస్థితి సమాచారం సేకరిస్తున్నారు. దీంతో అప్పటి మండల ప్రజాపరిషత్ పాలకవర్గం.. గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల పాటు ప్రజలకు వైద్యసేవలు అందించాలని తీర్మానించింది. నివేదికను కలెక్టర్కు పంపించింది. ప్రజల నుంచి కూడా అత్యధిక డిమాండ్ వస్తోంది. అయినా, పీహెచ్సీలో నేటికీ నిరంతర వైద్యసేవలు అందుబాటులోకి రావడం లేదు.
27 గ్రామాలు.. 11 సబ్ సెంటర్లు..
సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ప్రభుత్వ ప్రాథమి క ఆరోగ్యం కేంద్రం పరిధిలో 27 గ్రామ పంచాయ తీలు ఉన్నాయి. 11 సబ్ సెంటర్లు సేవలు అందిస్తు న్నాయి. ఇందులో గర్రెపల్లి, ఐతరాజుపల్లి, పూ సాల, గట్టెపల్లి, కొదురు పాక, సుల్తానాబాద్ –1, సుల్తానాబాద్ –2, సుద్దాల, తొగర్రాయి, కనుకులలోని ఆరోగ్య ఉప కేంద్రాల ద్వారా కూడా పల్లెవాసులకు వైద్యసేవలు అందిస్తున్నారు. అయితే, అక్కడ వైద్య పరీక్షలు చేసుకున్నవారికి అదనపు టెస్ట్లు అవసరమైతే గర్రెపల్లి పీహెచ్సీని ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా అవుట్ పేషెంట్లతోపాటు టెస్ట్ల కోసం వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. అంతేగాకుండా.. రైస్మిల్లులు, ఇటుకబట్టిల్లో పనిచేసే ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకూ గర్రెపల్లి పీహెచ్సీ అందుబాటులో ఉంది.
కాయకల్పకు ఎంపిక..
గర్రెపల్లి పీహెచ్సీలో అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తున్నందుకు గాను కేంద్రప్రభుత్వం కాయకల్ప పథకం కింద ఎంపికచేసింది. దీంతో ఆస్పత్రి అభివృద్ధి, వైద్యపరికరాలు, ఇతరత్రా సేవల కోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తోంది.

నిరంతర సేవలు ఎప్పుడు?