
పాడుబడినా..!
● గిరిజనుల
కష్టాలు పట్టని మంత్రి
● ధ్వజమెత్తిన ఏఐఎస్ఎఫ్
నాయకులు
బొబ్బిలిరూరల్:
మండలంలోని గోపాలరాయుడుపేట పంచా యతీ పరిధి బట్టివలస ప్రాథమిక పాఠశాల గిరిజన విద్యార్థులు పడుతున్న కష్టాలు ఆశాఖ మంత్రి సంధ్యారాణికి పట్టడం లేదని ఏఐఎస్ఎఫ్ రారష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ బి.రవికుమార్ విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆయన సంఘం సభ్యులతో కలిసి పాఠశాల పరిస్థితిని పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన శాఖ మంత్రి జిల్లాలో ఉన్నా ఇక్కడి గిరిజనుల సమస్యలను పట్టించుకుకోవడం లేదన్నారు. గత విద్యాసంవత్సరంలో ఇక్కడి ప్రాథమిక పాఠశాల దుస్థితిపై పలుమార్లు విన్నవించినా స్పందన కరువైందని, కనీసం ఐటీడీఏ అధికారులు సైతం ఇక్కడి పాఠశాలను సందర్శించి సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఎమ్మెల్యే బేబీనాయన యూటీఎఫ్ ప్రతినిధులకు తాత్కాలిక షెడ్లను నిర్మిస్తామని చెప్పిన మాట మరిచారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా పాలకులు, ప్రభుత్వయంత్రాంగం ఇక్కడి పాఠశాల దుస్థితిపై స్పందించి గిరిపుత్రుల విద్యాభివృద్ధికి కృషిచేయాలని కోరారు.

పాడుబడినా..!