శ్రీకాకుళం పాతబస్టాండ్: నిర్భయ్ ఫండ్తో మహిళలకు రక్షణ, భద్రతా సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాను ఎంపిక చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్తో కేంద్ర ప్రభుత్వ అధికారులు వర్చ్వుల్గా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు పింక్ టాయిలెట్లు, సీసీ టీవిలు, క్రిటికల్ కేర్ యూనిట్లు, చార్జింగ్ స్టేషన్లు, చీకటి ప్రదేశంలో హైమాస్క్ లైట్లు, పోలీస్ శాఖ పానిక్ బటన్ సౌకర్యం, సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ కల్పిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రావణ్కుమార్, డీఎస్పీ వివేకానంద, డీటీసీ మణికుమార్, జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి పి.శోభారాణి, డీసీహెచ్ఎస్ విజయలక్ష్మి, ఎంవీఐ ఆర్.అనిల్ తదితరులు పాల్గొన్నారు.
తీర పరిరక్షణ అందరి బాధ్యత
సోంపేట: సముద్రతీరాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండ్య అన్నారు. అంతర్జాతీయ తీర ప్రాంత స్వచ్ఛత దినోత్సవం సందర్బంగా బారువ తీరంలో శనివారం మహా స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ సిబ్బంది, విద్యార్థులు, ట్రీ ఫౌండేషన్ ప్రతినిధులు, అధికారులతో కలిసి చెత్తాచెదారాలు తొలగించారు. కార్యక్రమంలో అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి టి.దేవరాజు, మైరెన్ సీఐ రమేష్, ఎంపీడీఓ ఈశ్వరమ్మ, ట్రీ ఫౌండేషన్ ప్రతినిధులు సూరజ్ ప్రధాన్, కొండ సోమేశ్వరరావు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


