మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): యోగ సాధనను జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాల ఆవరణలో జరుగుతున్న 6వ జాతీయ జూనియర్, సీనియర్–సీ యోగాసన చాంపియన్షిప్–2025–26లో పతకాలు పొందిన పలు విభాగాల క్రీడాకారులకు మంత్రి రవీంద్ర సోమవారం పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాను ఒలింపిక్స్లో ప్రవేశపెడితే భారత్కు తప్పకుండా పతకాలు వస్తాయన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమా పోటీలను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకష్ణ ప్రసాద్ ,ఏపీ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఎ.రాధిక, ఉపాధ్యక్షుడు రాజశేఖరరెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.ప్రేమ్కుమార్, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కొంగర సాయి పాల్గొన్నారు.
విజేతల వివరాలు...
హ్యాండ్ బ్యాలెన్స్ మహిళల వ్యక్తిగత విభాగంలో పి.ప్రసూన (ఆంధ్రప్రదేశ్) ప్రథమ, ఆష్మా దాస్ (పశ్చిమ బెంగాల్) ద్వితీయ, పంపం దేవి (గోవా)తృతీయ స్థానంలో నిలిచారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో ఇంద్రజిత్ (ఏఐపీఎస్ సీబీ), వినాయక్ ఎం.కొంగి (కర్ణాటక), తన్మే అధికారి (ఉత్తరాఖండ్), బ్యాక్ బెండింగ్ మహిళల వ్యక్తిగత విభాగంలో అర్చన కవాటేకర్ (మహారాష్ట్ర), బిన్నీ కుమారి బాల (బీహార్), శీతల బైస్య (అసొం), పురుషుల వ్యక్తిగత విభాగంలో అయ్యంపిళ్ళై (తమిళనాడు), బీరేంద్రకుమార్ యాదవ్ (హరియాణ), రాహుల్ శాండోర్ (మహారాష్ట్ర) ఒక్కో విభాగంలో వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు.
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ప్రమాదవశాత్తు కొండపై నుంచి జారి పడి ఒకరు మృతి చెందిన ఘటన కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలోని షాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది. ఘటనపై మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జక్కంపూడి షాబాద్ గ్రామానికి చెందిన పేరం పాండురంగారావు గ్రామానికి సమీపంలోని టిడ్కో ఇళ్లకు వాచ్మెన్గా పని చేస్తుంటాడు. ఈనెల 27వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో పాండురంగారావు టిడ్కో ఇళ్ల చుట్టూ పరిశీలించేందుకు వెళ్లి తిరిగి రాలేదు. దీనిపై పాండురంగారావు భార్య వెంకటేశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమవారం ఉదయం కొండపై ఎవరో మనిషి ఉన్నాడని తెలుసుకుని ఘటనా స్థలానికి వెళ్లారు. పాండురంగారావును కిందకు తీసుకువచ్చే క్రమంలో కాలు జారి కింద పడి తలకు గాయాలయ్యాయి. వెంకటేశ్వరమ్మ అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా, వారు వచ్చే సమయానికి పాండురంగారావు చనిపోయాడు. వెంకటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మంత్రి కొల్లు రవీంద్ర