
గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
ఉయ్యూరు: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్నజీర్ పర్యటనకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. ఈ నెల 25న జిల్లాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటించనున్నారు. ఈ పర్యటనపై ఉయ్యూరులోని శ్రీ విశ్వశాంతి విద్యాసంస్థ ప్రాంగణంలో శనివారం సమీక్ష సమావేశం జరిగింది. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు కృష్ణా విశ్వవిద్యాలయంలో జరిగే స్నాతకోత్సవానికి గవర్నర్ హాజరవుతారని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. విజయవాడ నుంచి యూనివర్సిటీ వరకూ గవర్నర్ నజీర్ పర్యటనకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విశ్వవిద్యాలయం పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, రహదారులపై గుంతలు పూడ్చి సరిచేయాలని, వసతులు, సౌకర్యాలు, భద్రతా చర్యలపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఎస్పీ గంగాధర్రావు మాట్లాడుతూ.. ప్రముఖులు పర్యటించే రహదారుల వెంబడి గ్రీన్ చానల్ ఏర్పాటుచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ గీతాంజలి శర్మ, కృష్ణా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ రాంజీ, డీఆర్వో చంద్రశేఖర్రావు, యూనివర్సిటీ రిజిస్ట్రారు ఉష, జెడ్పీ సీఈఓ కన్నమనాయుడు, ఎస్సీ సంక్షేమ సాధికారిత అధికారి షాహిద్ బాబు, అగ్నిమాపక అధికారి ఏసురత్నం, డీపీఓ అరుణ, డీఈఓ పి.వి.జె.రామారావు, ఆర్డీఓలు స్వాతి, హెలా షారోన్ పాల్గొన్నారు.