డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం కావాలి | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం కావాలి

Jun 22 2025 7:15 AM | Updated on Jun 22 2025 7:15 AM

డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం కావాలి

డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం కావాలి

పటమట(విజయవాడతూర్పు): భవిష్యత్‌ తరాలకు డ్రగ్స్‌ రహిత సమాజాన్ని అందించాలని ఎన్టీఆర్‌ జిల్లా ఈగల్‌ టీం సీఐ టి.ధనుంజయ్‌ పేర్కొన్నారు. నవజీవన్‌ బాల భవన్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించు కుని శనివారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఐ ధనుంజయ్‌ మాట్లాడుతూ.. యువత, విద్యా ర్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్‌ విక్రయాల గురంచి తెలిసిన వారు వెంటనే పోలీసులకు లేదా 1972 నంబరుకు సమాచారం అందించాలని కోరారు. నవజీవన్‌ బాల భవన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఫాదర్‌ తంబీ జోసెఫ్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలతో బతుకు దుర్భరం చేసుకోవద్దని సూచించారు. ర్యాలీలో పట మట త్రివేణి కళాశాల నుంచి ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద మానవహారాన్ని నిర్వహించి డగ్స్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతనం డ్రగ్సకు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో నవజీవన్‌ బాల భవన్‌ ప్రోగ్రాం మేనేజర్‌ గోళ్లమూడి శేఖర్‌బాబు, త్రివేణి జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ పుష్పలత, ఈగల్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.వీరాంజనేయులు, నవజీవన్‌ బాల భవన్‌ జోనల్‌ కోఆర్డినేటర్లు జ్యోతి చంద్రిక, నజ్మా, కె.ప్రియాంక, జాకబ్‌ రాజు, బి.రమేష్‌, దేవమణి, డి.వెంకటేశ్వరావు, లీలావతి, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement