
యువతలో తీవ్రమైన ఒత్తిడి..
ప్రస్తుతం యువత ఎక్కువగా తీవ్రమైన స్ట్రెస్కు గురవుతున్నారు. వారిపై సెల్ఫోన్, సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువగా ఉంటోంది. వాటికి అడిక్ట్ అవడంతో ఇతర వాటిపై దృష్టి సారించలేక పోతున్నారు. చదువులో రాణించలేక పోవడం, ఉద్యోగంలో పనిపై దృష్టి పెట్టలేక పోవడం, వ్యాపారులు, ఇలా అనేక రంగాల వారు కౌన్సెలింగ్ కోసం మా వద్దకు వస్తున్నారు. దేనినైనా అవసరం మేరకు వినియోగించాలి. మానసిక ఉల్లాసం కోసం కొత్త ప్రాంతాలను సందర్శించడం, ఆటలు వంటి వాటిపై దృష్టి సారించాలి.
– డాక్టర్ గర్రే శంకరరావు, సైకాలజిస్టు