కళాత్మక యోగాసనాలతో ప్రజల్లో చైతన్యం | - | Sakshi
Sakshi News home page

కళాత్మక యోగాసనాలతో ప్రజల్లో చైతన్యం

Jun 17 2025 7:01 AM | Updated on Jun 17 2025 7:01 AM

కళాత్

కళాత్మక యోగాసనాలతో ప్రజల్లో చైతన్యం

గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం):కళాత్మక యోగాసనాలతో ప్రజల్లో మరింత చైతన్యం వెల్లివిరుస్తుందని సెకండరీ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శిరి తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురష్కరించుకుని గుంటుపల్లి డాన్‌ బాస్కో పాఠశాలలో రాష్ట్ర స్థాయి యోగా జట్లు ఎంపిక కోసం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి యోగాసన పోటీలను జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశతో కలసి సోమవారం ఆమె ప్రారంభించారు. యోగా చిత్రలేఖనం, యోగా ఫొటోగ్రఫీ, యోగా స్లోగన్స్‌ వంటి అంశాలపై జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2.20 కోట్లు మందికి యోగా శిక్షణపై రిజిస్ట్రేషన్‌ చేశామన్నారు. ప్రతి సచవాలయం పరిధిలో శిక్షణ ఇచ్చామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి శిక్షణ ఇచ్చి పోటీలు జరిపామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వందకు పైగా పర్యాటక ప్రాంతాలు గుర్తించి 76 కేంద్రాల్లో యోగా శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో 10లక్షల మందికి యోగా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. 241 పడవలపై కృష్ణానదిలో వందలాది మంది ప్లోటింగ్‌ యోగా నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పినట్లు తెలియజేశారు. జాయింట్‌ కలెక్టర ఇలిక్కియ, డీఆర్డీఏ పీడీ నాంచారయ్య, డీఎంహెచ్‌ఓ సుహాసిని, జిల్లా ఆయుష్‌ అధికారి రాణి తదితరులు పాల్గొన్నారు.

రక్తదానంతో ప్రాణాలు కాపాడవచ్చు

ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ లక్ష్మీకాంత్‌రెడ్డి

ఎయిర్‌పోర్ట్‌(గన్నవరం):సమాజంలో రక్తదాన ఆవశ్యకతను ప్రతిఒక్కరు గుర్తించాలని విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ ఎల్‌. లక్ష్మీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక విమానాశ్రయంలో సోమవారం ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. తొలుత శిబిరాన్ని ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ ప్రారంభిచడంతో పాటు స్వయంగా ఆయన రక్తదానం చేసి మిగిలిన ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా అపదలో ఉన్న మరొకరి ప్రాణాలను కాపాడవచ్చని చెప్పారు. రక్తదానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని సొసైటీ జిల్లా చైర్మన్‌ బాలాజీ తెలిపారు. 33 మంది రక్తదానం చేసినట్లు సొసైటీ జిల్లా కార్యదర్శి భవిరి శంకర్‌నాథ్‌ తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌ ఎంప్లాయీస్‌ కార్యదర్శి శ్రీహరి, సొసైటీ కోశాధికారి కె.రామ్‌బాలాజీ, గన్నవరం శాఖ చైర్మన్‌ చిన్ని మాధవి, రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు డాక్టర్‌ ఎం.విజయకుమార్‌, ఎం. ప్రభాకరచౌదరి, డాక్టర్‌ అంజనీకుమార్‌, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కళాత్మక యోగాసనాలతో ప్రజల్లో చైతన్యం  1
1/1

కళాత్మక యోగాసనాలతో ప్రజల్లో చైతన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement