కోపా సేవ.. భవితకు తోవ

స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్‌ జిల్లా             కలెక్టర్‌ ఢిల్లీరావు(ఫైల్‌)
 - Sakshi

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): కులమతాలకు అతీతంగా ప్రతిభావంతులను గుర్తించి ఏటా స్కాలర్‌షిప్‌లను అందజేయటంతో పాటు సామాజిక సేవలు అందిస్తున్నారు కోపా సభ్యులు. కోపా ద్వారా ఆర్థిక సాయం అందుకొని ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. కోపా ద్వారా దేశ, విదేశాలలో స్థిర పడిన ఎంతో మంది విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలలో తమదైన పాత్రను పోషిస్తున్నారు.

ఇదీ కోపా ప్రస్థానం..

25 ఏళ్ల క్రితం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పనిచేస్తున్న అధికారులు, న్యాయవాదులు, వైద్యులు, ప్రొఫెసర్‌లు, ఇంజినీర్లు కలిసి కాపు అఫీషియల్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌(కోపా) ఏర్పాటు చేశారు. సభ్యులు తలా కొంత వేసుకోవటంతో పాటు దాతల సహకారంతో ఏటా క్రమం తప్పకుండా ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించి వారికి స్కాలర్‌షిప్‌లను అందజేస్తున్నారు.

విద్యార్థులకు ఏటా స్కాలర్‌షిప్‌లు

కులమతాలకు అతీతంగా ప్రతిభ

కలిగిన విద్యార్థులకు ప్రోత్సాహం

25 ఏళ్లుగా వివిధ సేవా కార్యక్రమాలు

నిర్వహిస్తున్న సంస్థ

Read latest NTR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top